రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ మహిళ అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే సాయి కుమారి అనే మహిళ ఈనాడు కార్యాలయం నాలుగవ అంతస్తులోని కాల్సెంటర్లో పనిచేస్తుంది. కాగా ఆమె రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈనాడు కార్యాలయం నాలుగవ అంతస్తు నుంచి కింద పడి మృతి చెందింది. ఈ దుర్ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆమె కావాలని ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు పలువురిలో తలెత్తుతున్నాయి.
యాజమాన్యం వేధింపులు, పని ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సాయి కుమారి భర్త కూడా ఈనాడు సంస్థలోనే పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారని తెలుస్తుంది. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోకి మీడియాను అనుమంతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.