కాపులకి ఆరాధ్యుడు వంగవీటి మోహన రంగా కొడుకుగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన వంగవీటి రాధా తన రాజకీయ జీవితం లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కుని ఆద్యంతం తప్పు నిర్ణయాలతో తన రాజకీయ భవిష్యత్తును తానే అంధకారంలోకి నెట్టుకున్నాడు…
వంగవీటి రంగా గారితో వైయస్సార్ కి ఉన్న మితృత్వం కారణం చేత వైయస్సార్ ఆహ్వానం మేరకు వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఏలేశ్వరపు జగన్ మోహన్ రాజు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అదే అతని చివరి గెలుపు కూడా…పదవీ కాలం ముగియకముందే ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడతూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయాడు. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు చేతిలో ఓడిపోయాడు. ఆయన 2015లో వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేశాడు. ఆయనకు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో క్రమంగా వైసీపీకి దూరం అవుతూ 2019 లో వైసీపీ ని వీడి టీడీపీలో చేరాడు.
మొదట వైయస్సార్ లాంటి నాయకుణ్ణి నమ్ముకోకుండా చిరంజీవితో నడవాలని నిర్ణయించుకోవడం, 2014 లో వైసీపీ లో జాయిన్ అయ్యి ఓడిపోయాక క్రియాశీలకంగా ఉండకపోవడం, తనని సెంట్రల్ నియోజకవర్గం ఇంచార్జ్ గా చేసిన నాటి నుండి నియోజకవర్గంలో ఏనాడూ చురుగ్గా లేకుండా గడప గడపకు వైయస్సార్సీపీ కార్యక్రమం లో మిగిలిన అభ్యర్థులు దూసుకుపోతున్నా తను మాత్రం పట్టిచ్చుకోకపోవటంతో పార్టీ అంతర్గత సర్వేల ద్వారా తను గెలిచే అవకాశం లేదని తేలినా, పార్టీ తనని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కోరింది. కానీ పట్టుబట్టి సెంట్రల్ టికెట్టే కావాలని భీష్మించుకు కూర్చున్నాడు, చివరికి టీడీపీ లో జాయిన్ అవ్వగా బాబు అసలు టికెట్టే ఇవ్వలేదు…
ఆద్యంతం తను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా ఎప్పుడు తప్పుడు నిర్ణయాలే తీసుకున్నాడు… తన తండ్రిని చంపిన టీడీపీ లో జాయిన్ అవ్వడం, టీడీపీ కి తన తండ్రి మరణానికి సంబంధం లేదని చెప్పడం మొత్తం కాపు సామాజిక వర్గానికే విస్మయం కలిగించింది. వ్యక్తిగతంగా కూడా రాధాని ఎన్నో ఇబ్బందులకి గురిచేసింది టీడీపీ, పోలీస్ స్టేషన్ లో చొక్కా విప్పి కూర్చోబెట్టారు..పార్టీ లో జాయిన్ అయిన తర్వాత అయినా మర్యాద ఇచ్చారా అంటే అదీ లేదు, 2019 లో ఎంపీ గా పోటీ చేయమని వైసీపీ కోరితే లేదు నాకు సెంట్రల్ నియోజకవర్గమే కావాలని అలిగి టీడీపీ లోకి వెళ్లిన రాధా టీడీపీ లో టికెట్ కూడా సంపాదించలేకపోయాడు, ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా రాధాకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు…
రంగా తన జీవితాంతం టీడీపీ కి వ్యతిరేకంగా పోరాటం చేసి చివరికి టీడీపీ చేతిలోనే హతం అయ్యాడు. కానీ కాపులలో, దళిత బహుజనుల్లో ఆయనకి గొప్ప గౌరవం నేటికీ ఉంది… ఆయన కొడుకు అయ్యుండి ఆయన వారసత్వాన్ని కొనసాగించాల్సింది పోయి, తన వారికి అండగా నిలబడాల్సింది పోయి, ఎన్నడూ క్రియాశీలకంగా లేకుండా పది మందిని గెలిపించుకోవాల్సిన స్థాయి కి ఎదగాల్సిన వ్యక్తి కనీసం తను గెలవడం తర్వాత సంగతి పోటీ చేయడానికి టికెట్ సంపాదించుకోలేకపోవడం బాధాకరం… కాపులకు రంగా గారు ఇచ్చిన భరోసా లో పావు వంతు కూడా రాధా ఎన్నడూ ఇవ్వలేకపోయాడు.. రాజకీయాల్లో వారసత్వం ఎంత గొప్పదైనా పోరాట పటిమ, ఓపిక, కష్టపడే తత్వం లేకుంటే అది దేనికి కొరగాదు అనే విషయానికి వంగవీటి రాధా ఉదంతమే ఉదాహరణ…
రాజకీయాల్లో ఎప్పుడు క్రియాశీలకంగా ఉండాలి, సరైన నిర్ణయం తీసుకోగలగాలి, బద్ధకం అనేది దరిదాపుల్లోకి కూడా రాకూడదు.. లేకుంటే వంగవీటి రాధా లా అర్థంతరంగా ప్రస్థానం ముగించాల్సి వస్తుంది…