2019 ఎన్నికల ఫలితాల తర్వాత 2022 డిసెంబర్ 31 వరకూ 1310 రోజులకు కానీ పవన్ ఏపీకి వచ్చి పోయింది ఎన్ని సార్లో మీకు తెలుసా.
2019 లో 14 సార్లు, 2020 లో 12 సార్లు, 2021 లో 11 సార్లు, 2022 లో 23 సార్లు . మొత్తంగా 60 సార్లు. సగటున సంవత్సరానికి పదిహేను సార్లు రాష్ట్రానికి వచ్చి పోయేవారిని టూరిస్ట్ అంటారా పొలిటిషియన్ అంటారా,
2023 జనవరి 24 న పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహికి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేయించి ఇహ పై వారాహి మీద ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి ప్రశ్నిస్తానని, పోరాటాలు చేస్తానని గదలు పట్టుకొని శపధం చేశారు.
ఆ యాడాదిలో కేవలం నాలుగు సార్లు మాత్రమే వారాహి పై ఏపీకి వచ్చిన పవన్ తరువాత ఆ వాహనాన్ని ఏం చేశారో కానీ పవన్ ఆ వాహనం పై రాష్ట్రం మొత్తం తిరుగుతాడని ఆశతో వాహనం కొని గిఫ్ట్ ఇచ్చిన టీ కొట్టు యజమానిని మాత్రం ఆవేదనకి గురి చేశాడు.
వారాహి పూజకి అయిదేళ్ల ముందే కొండగట్టు ఆంజనేయ స్వామికి కూడా శఠగోపం పెట్టాడు మన సేనాని,
2018 జనవరి 22 న కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొన్న పవన్ ఆ గుడికి 11 లక్షల రూపాయల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించి పోయారు కానీ ఇప్పటి వరకూ ఆ విరాళం మాత్రం అందించలేదు.
నోరు లేని దేవుణ్ణి మాత్రమే కళ్ళు, చెవులు, నోరు ఉన్న ప్రజల్ని కూడా ఇలా పలు మార్లు పలు రకాలుగా మోసం చేశాడు పవన్ .
మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గృహాన్ని కోటి రూపాయల ఖర్చుతో స్మారక భవనంగా మారుస్తానని చెప్పి అయిదేళ్లయినా ఆ ఇంటి వైపు తొంగి కూడా చూడలేదు.
పిరికితనం ఆవహించిన రాయలసీమ వాసులకు ధైర్యం తెచ్చేందుకు రైల్వేకోడూరులో అతి పెద్ద గ్రంధాలయం నిర్మిస్తానని చెప్పి నాలుగేళ్లు అయినా భూమి పూజ కూడా చేయలేదు.
భీమవరంలో కోటి రూపాయలతో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పి ఆరేళ్లు అవుతుంది. విగ్రహం పెట్టలేదు సరికదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అల్లూరి విగ్రహం ఏర్పాటు చేస్తే ఆ విగ్రహం ఆవిష్కరణకు కూడా వెళ్ళలేదు.
2018 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన వెంకట్ రాహుల్ అనే బాపట్ల క్రీడాకారుడికి పది లక్షల నగదు బహుమతి ప్రకటించి ఇప్పటి వరకూ పది రూపాయలు కూడా ఇవ్వలేదు.
మన నది మన నుడి అనే కార్యక్రమం ద్వారా నదులు కలుషితం కాకుండా పరిరక్షిస్తామని, అమ్మ వడి లాంటి తెలుగు నుడిని కాపాడతానని ప్రకటించి నాలుగేళ్లు అయ్యింది. ఈ దిశగా ఒక్క కార్యాచరణ లేదు.
చారెడు నేల బతుకుబాట అనే పధకం ద్వారా కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన యువత కోసం 250 గజాల్లో 81 రకాల పంటలు పండించి ఒక కుటుంబానికి సరిపోయే ఆదాయం సంపాదించుకోవడం నేర్పు్తానని చెప్పాడు కానీ ఒక్క యువకుడికి నేర్పలేదు.
2009 కి ముందు కామన్ మెన్ ప్రొటక్షన్ ఫోర్స్ అనే సంస్థ ప్రకటించి దానికి కోటి రూపాయల చెక్కు ఇచ్చి ఇహ పై సామాన్యులకు రక్షణగా నిలుస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఆ ఫోర్స్ ఏమయ్యిందో, ఆ కోటి ఏమయ్యాయో సమాధానం లేదు.
తన సభ పెట్టుకోవటానికి భూములిచ్చిన ఇప్పటం గ్రామానికి 50 లక్షలు విరాళం ప్రకటించాడు, ఇంతవరకూ ఇవ్వలేదు.
చివరిగా 2014 లో టీడీపీ మేనిఫెస్టోకి తనది పూచి అని చెప్పి ఓట్లు అడిగిన పవన్, ఆ తరువాత అది అమలు చేయకుండా మోసం చేసిన టీడీపీతో మళ్ళీ పొత్తు అని ఓట్లడుగుతున్నాడు. మళ్ళీ మోసం చేయడని నమ్మకం ఏంటి.
ఆ మోసం చేసినా మళ్ళీ అయిదేళ్ల తర్వాత కదా జనంతో అవసరం . అప్పటికి ఏదొక మోసపు మాటలు చెప్పొచ్చులే అనే కదా పవన్ ధీమా.
ఇంకెన్నాళ్ళు ఇలా