పవన్ కళ్యాణ్ నీతులు మాత్రమే చెబుతాడు వాటిని ఆచరించడని మరోసారి తేలిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో రెండో విడత వారాహి యాత్రలో భాగంగా అభిమానులు కేరింతల మధ్యలో విడివాడ రామచంద్ర రావు ని ఉదహరిస్తూ పవన్ కళ్యాణ్ చెప్పిన నీతులు ఇంకా అందరికి గుర్తు ఉండే ఉంటాయి. బలమైన నాయకుడు రామచంద్రరావుకు గత 2019 ఎన్నికల్లో సీటును కేటాయించకపోవడం తన తప్పిదమని ఆయనకు క్షమాపణ కోరుతున్నామని వేలాదిమంది ప్రజల మధ్య ఆర్భాటాంగా ప్రకటించుకున్నారు.
గడిచిన ఎన్నికల్లో విడివాడ రామచంద్ర రావుని కాదని పసుపులేటి వెంకట రమణరావుకి టికెట్ ఇస్తే తాను వెళ్ళిపోయాడని సీటు ఇవ్వని విడివాడ రామచంద్రారావు మాత్రం ఇక్కడే నా కోసం పార్టీలో ఉన్నాడని ఇలాంటి వ్యక్తికి నేను సీటు ఇవ్వనందుకు భాదపడుతున్నానని అందుకే తనకి పబ్లిక్ గా క్షమాపణ చెప్పుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ఈ డైలాగులతో కేరింతలు కొడుతూ హంగామా చేయడం జనసైనికుల వంతైంది. తీరా ఇప్పుడు ఎన్నికలకి వచ్చే సరికి నాడు నీతులు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా విడివాడకు సీటు ఇవ్వకుండా తెలుగుదేశానికి చెందిన అరిమిల్లి రాధ కృష్ణకు సీటు వదిలేసాడు.
నమ్ముకున్న వాడి కోసం నిలబడలేని పవన్ కళ్యాణ్ ఇంక జనసేనలో ఎవరికి న్యాయం చేస్తాడు. చంద్రబాబుని భుజాన మోయడం అవసరానికి తగ్గట్టు భారీ సినిమా డైలాగులు కొడుతు అమాయక జన సైనికుల చేత చప్పట్లు కొట్టించుకోవడం తప్ప చంద్రబాబు ఆదేశాలను పక్కన పెట్టి తన వారికి న్యాయం చేసినట్టు ఒక్కటంటే ఒక్క ఉదాహరణ కూడా లేదు. ఈ నేపద్యంలో తణుకు జనసైనికులు పవన్ పై లోలోపల రగులుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.