వ్యూహం సినిమా రిలీజు సంధర్భంగా ఈ రోజు ప్రసాదు ల్యాబ్సులో ప్రీమియర్ షో నిర్వహించారు. రామ్గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిజీవితంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా తెరకెక్కింది.
తన తండ్రి మృతి వలన ప్రాణాలు కోల్పోయిన వేలాది అభిమానులకు ఓదార్పు ఇవ్వడం కోసం చేద్దామనుకున్న యాత్రను సోనియాగాంధీ ఆపించాలనుకోవడం, అప్పటి ఆ పరిస్థితులను అధికారం కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు, ప్రజల్లో పాపులారిటీ తెచ్చుకుంటున్న జగన్ను రాజకీయంగా ఎలా దెబ్బకొట్టాలా అని చేసిన పనికి రచనను జగన్ తన వ్యూహాలతో ఎలా బెడిసి కొట్టించి ఒక నాయకుడిగా ఎదిగాడు అన్న ప్రస్థానాన్ని ఈ సినిమాలో వివరంగా చూపించారు. చంద్రబాబు చేసిన కుట్రలను జగన్ ఎదుర్కొన్న తీరును కళ్ళకు కట్టించినట్టు చూపించారు.
2014 ఎన్నికల ఓటమి తర్వాత, జగన్ ఎలా పుంజుకుని మళ్ళీ 2019 లో భారీ మెజారిటీతో గెలిచారు? వాటి వెనుక అనుసరించిన వ్యూహాలేమిటి అన్నవే ఈ సినిమాలో ముఖ్య కధ. అయితే గతకొంతకాలంగా విడుదల చేద్దామని ప్రయత్నిస్తున్న ఈ సినిమాని, తన తండ్రి పరువు ఎక్కడ పోతుందో అనే భయంతో లోకేష్ పలు కేసులు పెట్టి విడుదల ఆపించాలని విశ్వ ప్రయత్నాలను చేస్తున్నారు. అయితే ఆ కేసులు వీగిపోయి వ్యూహం రిలీజుకి సిద్ధమయింది.
దీనిపై రామ్ గోపాల్ వర్మ గత రెండ్రోజులుగా వివిధ ట్వీట్లు వేసి సందడి చేస్తున్నారు. ఈ వారం రిలీజవుతున్న సందర్భంగా… డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు హైదరాబాదులో ప్రసాద్ ల్యాబ్స్ లో “వ్యూహం” ప్రీమియర్ షో చూసారు. అనంతరం, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ “వాస్తవికతకు అద్దం పట్టినట్లు “వ్యూహం” సినిమా ఉందని” పేర్కొన్నారు.