2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ప్రకటించే అడ్డగోలు హామీల అమలు సాధ్యాసాధ్యాలను ప్రశ్నించే హక్కు ఓటర్లుకు ఉంది అని ఒక ప్రశ్నకు బదులుగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో పర్యటిస్తూ ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేయకూడదు , అలా చేస్తున్న వారిని కట్టడి చేస్తాం అని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న నకిలీ సమాచారాన్ని నియంత్రిస్తాం అన్నారు .
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రధానంగా ఆన్లైన్ లావాదేవీలపై దృష్టిసారించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ కు సూచించామని సీఈసీ వెల్లడించారు. ఫేక్ న్యూస్ పైన గట్టిగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు, పదే పదే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వారని ఉపేక్షించబోమని . ఇందుకు ఇటీవలి జరిగిన ఉదంతాలే నిదర్శమని అన్నారు. గతవారం తాము షెడ్యూల్ విడుదల చేయకమునుపే లోక్ సభ ఎన్నికల తేదీలపై తప్పుడు వార్తలు వచ్చాయి. ఆ వార్త మా దృష్టికి వచ్చినవెంటనే ఈ నకిలీ సమాచారాన్ని కట్టడిచేశామని కొద్ది గంటల్లోనే నేరుగా స్పందించి స్పష్టత ఇచ్చామని వెల్లడించారు . ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే దాకా ఇలాంటి నకిలీ సమాచారాన్ని ఎక్కడికక్కడ నియంత్రిస్తాం. ఇందుకోసం సోషల్ మీడియా కథనాలు, ఫేక్ ప్రకటనలపై దృష్టి పెట్టేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటూ సమావేశన్ని ముగించారు సీఈసీ రాజీవ్ కుమార్