ఓ వైపు ఎల్లో మీడియా.. మరో వైపు తెలుగుదేశం, జనసేనలు వలంటీర్లపై విషం కక్కుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబు నాయుడు వారిని బెదిరించారు. జగన్ను నమ్మితే జైలుకు పంపుతా అనే ధోరణిలో మాట్లాడి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈనాడు పత్రిక అయితే మొన్న ఊరూరా వలంటీర్లు.. అన్నిచోట్లా జగనన్న అరాచకాలు అంటూ వారిని కించ పరిచేలా రాసింది. పచ్చ పత్రికలు మొదటి నుంచి వలంటీర్లను సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. దీనిపై సేవా సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ప్రతులను తగులబెట్టారు. ప్రతి జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వానికి మంచి పేరు వస్తోంటే సహించలేక రామోజీరావు విషపు రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు.
గతంలో ఇలాగే ప్రచురించి అభాసుపాలైన సిగ్గు తెచ్చుకోకుండా మళ్లీ మళ్లీ కించపరుస్తున్నారని బాధపడ్డారు. ఇదిలా ఉండగా ఎల్లో గ్యాంగ్ తీరును ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడం పెత్తందారులకు నచ్చలేదని, అందుకే వారధిలా పనిచేస్తున్న వారిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.