అధికారంలోకి వస్తే ప్రతీ 50 కుటుంబాలకు ఒకరు చెప్పున రాష్ట్రం మొత్తం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి, ప్రభుత్వం ఇచ్చే ప్రతీ సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దకే తీసుకొస్తా అని మాటిచ్చి, ఇచ్చిన మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థ ను ప్రవేశ పెట్టింది జగన్ ప్రభుత్వం.ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తమ రాష్ట్రం లో అమలు చేయాలని కేరళ రాష్ట్రం నిర్ణయించింది…
సంక్షేమం లో, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేయడంలో ముందుండే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా జరుగుతున్న సంక్షేమం, ప్రభుత్వ పాలన ను చూసి ప్రేరణ పొంది తమ రాష్ట్రంలో కూడా అలాంటి వ్యవస్థనే శృష్టించాలని నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ వ్యవస్థ అనే ఆలోచన జగన్ కు ఏ విధంగా వచ్చిందో కానీ, ఆ వ్యవస్థ పురుడు పోసుకున్న రోజు నుండి ప్రజల్లో జగన్ ప్రభుత్వానికి మంచి ఆదరణ లభించింది, దానికి తోడు గ్రామ సచివాలయాల ఏర్పాటు చేయడం, గ్రామ సచివాలయాలకు వాలంటర్లను అనుసంధానం చేయడం వలన, మండల స్థాయి, జిల్లా స్థాయిలో జరగాల్సిన పనులన్నీ ఎవరి గ్రామంలో వారి వద్దే జరిగిపోతున్నాయి, గతంలో కొత్తగా పెన్షన్ నమోదు కావాలన్నా, కుల ధ్రువీకరణ పత్రం కావాలన్నా, పొలం సర్వే చేయించుకోవాలన్న, కాళ్లు అరిగేలా మండల కేంద్రం చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని నేడు అత్యంత సులువు చేసేసింది జగన్ ప్రభుత్వం. తనకు కేటాయించిన 50 కుటుంబాల్లో ప్రభుత్వ తరపున ఏ సేవ కోరినా దగ్గరుండి వాలంటీర్లే పని చేయిస్తున్నారు, ఒకటో తారీఖునే టంచను గా పెన్షన్లను ఇంటి వద్దకే తెచ్చిస్తున్నారు. ఇలా అనేక ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకే చేరువ చేయడానికి జగన్ ప్రభుత్వానికి సహకరిస్తున్న వాలంటీర్ వ్యవస్థ వలన సీఎం జగన్ కు వస్తున్న ప్రజాధారణను ముందు నుండీ ఓర్వలేక మొదటి రోజు నుండే వాలంటీర్ల మీద విపరీతమైన దుష్ప్రచారం చేసింది బాబు అండ్ కో. ఇళ్లలో ఎవరు లేనప్పుడు తలుపులు కొడుతున్నారు అని బాబు, ఒంటరి ఆడవారి సమాచారం ఇచ్చి మానవ అక్రమ రవాణాకి సహకరిస్తున్నారని పవన్, వాలంటీర్ వేలు విడిచిన మేనమామ రెండో కొడుకు బామ్మర్ది హత్య చేసాడని, వాలంటీర్లు అందరూ రౌడీలు అని ఎల్లో మీడియా, వాలంటీర్లు అంటే సంచులు మోసుకునే వారని ఆ వర్గ సినిమా వాళ్లు, ఒకటేమిటి ఇలా ఎన్నో రకాలుగా వారిపై మానసిక దాడి చేసినా, జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం, ఉత్సాహంతో వారు ఎప్పటికప్పుడు రెట్టింపు కష్టంతో పని చేసుకుంటూ పోతున్నారు…
ఇక చివరికి అధికారంలోకి వస్తే వాలంటీర్లని పీకేస్తాం అని, వాలంటీర్లను అరెస్ట్ చేస్తాం అని కూడా బెదిరింపులకు దిగింది బాబు బృందం.. ప్రజలకు మంచి జరుగుతుందని పక్క రాష్ట్రాలు వారి రాష్ట్రాల్లో ఈ వ్యవస్థను శృష్టించాలని నిర్ణయం తీసుకుంటే, ప్రజలకు మంచి జరిగితే ఓర్వలేని బాబు అండ్ కో మాత్రం మా జన్మభూమి కమిటీ కే గొప్ప అంటున్నారు… జగన్ మాత్రం మినిమం గవర్నమెంట్-మాక్జిమమ్ గవర్నెన్స్ అనే సిద్ధాంతాన్ని, గ్రామ స్వరాజ్యం అనే భావనను బలంగా నమ్ముకుని ఆచరణలో పెడుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు…