విశాఖపట్నం మరొక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేడుకకు సిద్ధమవుతుంది. మిలన్ – 24 పేరుతో జరగనున్న ఇండియన్ నేవీ బహుళ జాతీయ వ్యాయామ కార్యక్రమాన్ని ఈ నెల 19 నుంచి 27 వరకూ నిర్వహించనున్నారు. రెండు దశల్లో జరిగే బహుపాక్షిక విన్యాసాలకు భారత నౌకాదళం సారధ్యం వహించనుంది. ఈ వేడుకులు ఘనంగా నిర్వహించేందుకు తూర్పు నావికాదళం అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.
భారతదేశ నౌకాదళ శక్తిని ప్రపంచానికి చూపడమే లక్ష్యంగా బహుళ జాతీయ విన్యాసాలను ఇండియన్ నేవీ నిర్వహించనుంది. అంతేకాకుండా పలు దేశాల నౌకాదళాల మధ్య స్నేహ పూర్వక, వృత్తిపరమైన అంశాలు పెంపొందించేందుకు ఈ మిలాన్ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని భారతదేశం భావిస్తుంది. ఈ వేడుకులలో 50 దేశాలకు చెందిన నేవీ అధికారులు, ప్రముఖలు, సిబ్బంది పాల్గొనున్నారు. వారితో పాటు పలు దేశాలకు చెందిన 15 యుద్ధ నాకలు, ఇండియన్ నేవీకి చెందిన 20 ఓడలు, విక్రాంత్, విక్రమాదిత్యతో పాటు ఎయిర్క్రాఫ్టులు కూడా పాల్గొంటున్నట్టు నేవీ అధికారులు తెలిపారు.
ఈ వేడుకల్లో కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజధావసింగ్తో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి, పలువురు నేవీ చీఫ్ ఆఫీసర్స్ మరియు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.దేశం విదేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ కార్యక్రమం కోసం జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున శనివారం పరిశీలించారు.
వేడుకలను వీక్షించేందుకు లక్షలాది మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పలు చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను సీయం ఆఫీసు నుంచి ఆదేశాలు అందాయి. అదే మాదిరిగా సామాన్య ప్రజలువీక్షించేందుకు అనువుగా ఎల్.ఈ.డీలు ఏర్పాట్లు చేయనున్నారు. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయాలను అధికారులు అందించనున్నారు.