భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో భారతదేశాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళడానికి నీతి అయోగ్ ఒక విజన్ డాక్యుమెంట్ ను ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ ను కూడా వికసిత్ భారత్ లో భాగం చేస్తూ నీతి అయోగ్ రూపొందించిన ముసాయిదా విజన్ డాక్యుమెంట్ ని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి ప్రజెంట్ చేస్తూ నీతి ఆయోగ్ ప్రణాళిక అద్భుతంగా ఉందని కొనియాడారు.
వికసిత్ భారత్ లో భాగంగా పరిశ్రమలు, ఇంధనం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సేవలు, గ్రీన్ ఎకానమీ నగరాల అభివృద్ధి వంటి అంశాల్లో రాష్ట్రాన్ని అన్ని విధాలా మెరుగైన రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంటుందని సిఎస్ పేర్కొన్నారు. నీతి ఆయోగ్ ప్రవేశ పెట్టిన ఆర్థిక పరివర్తన గల నగరాలలో విశాఖ చోటు దక్కించుకోవటం, ఆర్థిక ప్రణాళికను నీతి ఆయోగ్ సిద్ధం చేయటం వంటి అంశాలు శుభపరిణామని తెలిపారు.
అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ, ప్రాథమిక రంగం అభివృద్ధి, పోర్ట్ ఆధారిత అభివృద్ధి వంటి రంగాల్లో దేశంలో అగ్రగామిగా ఉందని, 2019లో ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యంమత్రిగా బాధ్యతులు చేపట్టాక రాష్ట్రంలో ఉన్న వనరుల ఆధారంగా అభివృద్ధి చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్నిఉపయోగించుకొని కొత్తగా 17000 వేల కోట్లతో 4 పోర్టులు కడుతున్నారు. తద్వారా పోర్ట్ ఆధారిత ఇండస్ట్రీలలో పెట్టుబడులు ఆకర్షించవచ్చని ఆ వైపుగా ఆడుగులు వేసామని సీఎస్ డా.కెఎస్. జవహర్ రెడ్డి తెలిపారు.
విశాఖలో 2023లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో భాగంగా గ్రీన్ ఎనర్జీ విభాగంలో అత్యధికంగా తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులును ఆకర్షించింది. అందులో భాగంగా ఇప్పటికే రాయలసీమా ప్రాంతంలో నలభై వేల కోట్ల పెట్టుబడులకి సంబంధించిన పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. అదే సమయంలో ఎన్టీపీసీకి చెందిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సంస్థ లక్ష 10 వేల కోట్ల పెట్టుబడి పెడతామని ఎంఓయూ చేసుకున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం 1200 ఎకరాలకు సంబంధించి భూమి లీజు ఒప్పంద పత్రాలు పైన సంతకాలు చేసుకున్నట్లు సీఎస్ నీతి ఆయోగ్ కి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అంటే దేశానికే అన్నపూర్ణగా పేరుగాంచిందని ఈ రంగాలలోనే కాకుండా పర్యాటకపరంగా కూడా రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతోందని రానున్న రోజుల్లో దేశ ప్రగతికి ఆంధ్ర ప్రదేశ్ తోడ్పాటు అవుతుంది అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి తెలిపారు.