నిజమా RBI నివేదికలు ఏమి చెబుతున్నాయి.?
వైసీపీ ప్రభుత్వం నేరుగా కల్పించిన ఉద్యోగాలెన్ని?.
పరోక్షంగా కల్పించిన ఉద్యోగాలెన్ని?
రికార్థుల పరంగా 2019 తర్వాత నిరుద్యోగులు అయ్యిన ఆ ఇద్దరూ ఎవరు? .
ఆడుతూ పాడుతూ అప్పుడప్పుడు పాదయాత్ర చేస్తూ ఏదో ప్రపంచాన్ని ఉద్దరిస్తున్నట్లు ఫీలవుతున్న నారా లోకేష్.. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగం పెరిగిందని, దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు అధికంగా ఉన్నారంటూ అబద్ధపు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 24 శాతానికి పెరిగిందని ఈ ట్విట్టర్ పిట్ట కూసింది.. గతంలో ఉద్యోగ-ఉపాధి అవకావశాలతో నిండిన రాష్ట్రాన్ని సీఎం జగన్ నాశనం చేశారంటూ ఆ తెలివితక్కువ తలకి తోచింది చెప్పాడు. ఇంతకీ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో టీడీపీ రాష్ట్రంలో కేవలం 34 వేల ఉద్యోగాలనే భర్తీ చేసింది.
ఇవేమీ తెలియని నారా లోకేష్ తెలుసుకోలేకపోయిన విషయం ఏంటంటే.. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు తగ్గిందని, నవంబర్ 15, 2023 న ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో తెలుస్తుంది.. 2018–19లో గ్రామాల్లో ప్రతి 1000 మందికి 45 మంది నిరుద్యోగులుండగా.. 2022–23 లో ఆ సంఖ్య 33కు తగ్గిందని.. అలాగే 2018–19లో పట్టణాల్లో ప్రతి 1000 మందికి 73 మంది నిరుద్యోగులుండగా 2022–23లో ఆ సంఖ్య 65కు తగ్గిందని ఆర్బీఐ తన నివేదికలో తెలిపింది.
ఉద్యోగాలు, ఉపాధి కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేస్తూనే.. మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద పీట వేస్తూ ఉపాధి అవకాశాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెరుగుపరుస్తోంది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గణాంకాలు స్పష్టం చేశాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగితపై ఆర్బీఐ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికను పరిశీలిస్తే చంద్రబాబు హయాం (2018–19) లో నిరుద్యోగుల సంఖ్యతో పోల్చి చూస్తే 2022–23లో నిరుద్యోగుల సంఖ్య తగ్గిందని ఆర్బీఐ వెల్లడించింది.
వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుండి 2023 వరకు 4.93 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తే అందులో శాశ్వత ఉద్యోగాలు 2.13 లక్షలు ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ సచివాలయాల్లో 10 మంది చొప్పున, పట్టణ సచివాలయాల్లో 11 మంది చొప్పున శాశ్వత ఉద్యోగాలను కల్పించారు. తద్వారా రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2.5 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. దానివల్ల కొత్తగా 16.5 లక్షల మందికి ఉపాధి లభించింది. సంక్షేమ పథకాల ద్వారా మహిళలను వ్యాపారం వైపు ప్రోత్సహిస్తూ మహిళల్లో కూడా నిరుద్యోగాన్ని తగ్గించారు. చిన్నచిన్న వ్యాపారాలతో పాటు పెద్దపెద్ద మహిళా మార్ట్ల ద్వారా వ్యాపారాలను ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు, పురుషుల్లోని నిరుద్యోగుల సంఖ్యలో 2018–19 కంటే 2022–23లో తగ్గిందని ఆర్బీఐ వెల్లడించింది.
క్యాంపస్ ఉద్యోగాల కల్పనలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2021 లో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం 2016 లో 17.9శాతం ఉన్న నిరుద్యోగం ఆంధ్రప్రదేశ్ లో 2021, అక్టోబర్ నాటికి 5.4 శాతానికి తగ్గింది. అప్పుడు కూడా నివేదికలతో పని లేకుండా టీడీపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. కానీ ఇప్పుడు ఆర్బీఐ నివేదికను కూడా నారా లోకేష్ చదివి అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు.
ఈ సంస్థ ప్రాథమిక విధి దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం మరియు పాలించడం. భారతదేశంలో చట్టం ద్వారా స్థాపించబడిన సంస్థ ఆర్బీఐ.. వీరి కంటే నారా లోకేష్ కి ఎక్కువ తెలిసే ఛాన్స్ అయితే ఉండదు.. అందుకే నోరు అదుపులో పెట్టుకోవడం, తెలిసినవి మాత్రమే మాట్లాడటం.. తెలిసి తెలియని వాగుడు వాగకుండా ఉండటం మంచిది లేకపోతే ఇప్పుడు రాష్ట్రంలో పప్పుగా పేరు సంపాదించుకున్నవాడు.. దేశంలో కూడా ఆ పేరు సార్ధకం చేసుకుంటాడు.
2019 లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో ఊడిపోయిన ఉద్యోగాలు నారా లోకేష్ ది, వాళ్ళ నాన్న చంద్రబాబు గారిదే . బహుశా ఎప్పటికీ రాని ఉద్యోగాలు కూడా వాళ్ళవే.