ఈ మధ్య కాలంలో జనసేన పార్టీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు టీ టైమ్ అధినేత తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ అభిమానిగా అతని పర్సనల్ విషయాలు, ఖర్చులు చూసుకోవడమే కాకుండా పార్టీ కార్యక్రమాలకు నిధులు సమకూర్చి పవన్ కళ్యాణ్ ప్రచారాలకు వారాహి వాహనం సమకూర్చడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో వెలుగులోకి వచ్చారు. తనకు తన పార్టీ జనసేన కు నిధులు సమకూర్చినందుకు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కు మొదట పిఠాపురం టికెట్ కేటాయించారు. దాని తరువాత పవన్ కళ్యాణ్ స్వయంగా కాపులు అధికముగా ఉన్నారనే కారణంతో అక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం ఉందని, పిఠాపురంలో పోటి చెయ్యదలచి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దానితో పాటు పిఠాపురం ఎన్నికల నియోజకవర్గ ఇంచార్జి గా కూడా నియమించారు.
దీనితో తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీ పరిధిలోని మిగిలిన అన్ని నియోజకవర్గాలు వదిలేసి కేవలం పిఠాపురంలోనే మకాం వేసి పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలు స్వయంగా చూసుకుంటున్నారు. పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య సమన్వయ కర్తగా అన్ని పనులు చక్కబెడుతు పార్టీ కార్యక్రమాలకు తన సొంత నిధులు ఖర్చు చేస్తూ వస్తున్నారు. అత్యంత కీలకమైన ఈ సమయంలో కాకినాడ ఎంపీగా కొత్తగా అవ్వడం వలన అన్ని నియోజకవర్గాలు తిరిగే టైమ్ లేకున్నా కూడా కేవలం పిఠాపురం కే పరిమితమయ్యిన్నరు.
కాకినాడ ఎంపీ పరిధిలోని కాకినాడ రూరల్, సిటీ, పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నది లేదు. కేవలం పవన్ కళ్యాణ్ తన రాజకీయం కోసం తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ను పిఠాపురంలోనే బంధీ చేసి కాకినాడ ఎంపీ గా ప్రచారం చేసుకోనివ్వడం లేదు. అటు పవన్ కళ్యాణ్ కు ఎదురు చెప్పలేక ఇటూ ఎంపీ పరిధిలోని మిగిలిన నియోజకవర్గాలు తిరగలేక సతమతమవుతున్నారు . అదే టైంలో పిఠాపురం ఎలక్షన్ ఖర్చు మొత్తం తన మీదనే పవన్ కళ్యాణ్ వెయ్యడం తో అటూ ఎంపీ కి ఇటూ పిఠాపురం కు ఖర్చు తో నలిగిపోతున్నారు. ఇలానే ఇంకో పది రోజులు గడిపితే కాకినాడ ఎంపీ సీటు మీద ఆశలు వదిలేసుకోవడమే అని సన్నిహితుల వద్ద వాపోతున్నారు.
అటూ వైసీపీ అభ్యర్ధి అయిన చలమశేట్టి సునీల్ వరుసగా మూడుసార్లు తక్కువ మెజారిటీ తో ఓడిపోయారు అనే సానుభూతితో పాటు ఎంపీ పరిధిలో ప్రతీ గ్రామంలో వున్న పరిచయలతో ఎలక్షన్ ప్రచారంలో దుసుకుపోతున్నరు. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మాత్రం పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం కదిలి బయటకు రావడం లేదు. దీంతో ఉదయ్ కు ఓటమి భయం వెన్నాడుతుందనే ప్రచారం జరుగుతుంది.