షర్మిల బాబుకు నొప్పి తగలకుండా మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్, టీడీపీ అధినేత విఫలమయ్యారని విమర్శించారు. అన్నపై విరుచుకుపడుతున్న ఆమె తమ ప్రత్యర్థి తెలుగుదేశంపై మాట్లాడేందుకు నోరు మెదపడం లేదు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఓ వైపు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూ.. మరోవైపు తన కనుసన్నల్లో మరికొన్ని పార్టీలు పొత్తులు పెట్టుకునేలా కుట్రలకు తెరలేపారు. ఇందులో భాగంగా ఆయన ఆదేశాలతో విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ ఇతర నేతలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఇందులో అనేక రంగులు బయటపడ్డాయి. షర్మిల పూర్తిగా నారా వారి కోసం పనిచేస్తుండగా.. మిగిలిన వారు బీజేపీని తిట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
షర్మిల బాబుకు నొప్పి తగలకుండా మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్, టీడీపీ అధినేత విఫలమయ్యారని విమర్శించారు. అన్నపై విరుచుకుపడుతున్న ఆమె తమ ప్రత్యర్థి తెలుగుదేశంపై మాట్లాడేందుకు నోరు మెదపడం లేదు. ఏదో మొక్కుబడిగా రెండు ముక్కలు అంటున్నారు. తామంతా ఏపీ ప్రజల కోసం కలిసి పోరాడే అంశంపై చర్చలు జరిపామని, ఎన్నికల్లో పొత్తు, సీట్ల సర్దుబాట్లపై చర్చలు జరుగుతున్నాయన్నారు. పొత్తులపై త్వరలో అన్ని అంశాల మీద క్లారిటీ వస్తుందన్నారు. శ్రీనివారావు మాత్రం బీజేపీని దుమ్మెత్తిపోసిన చంద్రబాబు.. ఇప్పుడు వారి పొత్తు కోసం పొర్లుదండాలు పెడుతున్నారని విమర్శించారు. అందరం కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టత ఇచ్చేశారు. బాబు భక్తుడైన సీపీఐ రామకృష్ణ చాలా తెలివిగా బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందని దానిపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలో వస్తే అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తారని ధ్వజమెత్తారు. దేశం అత్యంత ప్రమాదంలో ఉందన్నారు. ప్రధాన ప్రాంతీయ పార్టీలు బీజేపీకి భయపడుతున్నాయని చెప్పారు.
మొత్తంగా అందరూ బాబు డైరెక్షన్లో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించారు. తెలుగుదేశం అధిష్టానం ఇచ్చే లిస్ట్ ప్రకారమే టికెట్ల కేటాయింపు ఉంటుంది. వారి అభ్యర్థులకు నష్టం కలగకుండా.. జగన్ను మాత్రం దెబ్బతీసేలా వీరి వ్యూహాలు ఉంటాయని స్పష్టమైంది.