చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ మూకుమ్మడిగా పన్నిన కుట్రతో విధులకి దూరమైన వాలంటీర్లను చూసి ఇప్పుడు సచివాలయ సిబ్బందికి టెన్షన్ పట్టుకుంది. జగన్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ సేవలను ప్రతీ గడపకి చేర్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ , దానికి అనుసంధానమైన వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుండి అక్కస్సు వెళ్లకక్కే చంద్రబాబు ఎట్టకేలకు ఈ వ్యవస్థలో ఒక భాగమైన వాలంటీర్లపై కసి తీర్చుకున్నారు. చంద్రబాబు చేసిన ఈ పనితో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకి టెన్షన్ మోదలైంది.
2024 ఎన్నికల్లో పొరపాటున తెలుగుదేశం అధికారం చేపడితామంటే గిట్టని చంద్రబాబు తమ ఉద్యోగాలను ఉంచుతాడా అనే ఆందోళ వారిలో కలుగుతుంది. తమది శాశ్వత ఉద్యోగమే అయినా ఎక్కడ సర్వీస్ రూల్స్ లోని లూప్ హోల్స్ ని చూపి సీఎం హోదాలో తమ ఉద్యోగాలకి గండి కొడతారో అని మదన పడుతున్నారు. ఇప్పటికే రఘురామ కృష్ణం రాజు చేత సచివాలయ ఉద్యోగులకి ఏం పని ఉండదు , వారిని ఖాళీగా కూర్చోపెట్టి ప్రభుత్వ ఖజానానుండి జీతాలు ఇస్తున్నారనే తప్పుడు సంకేతాలు వెళ్ళేలా మాట్లాడిస్తున్న చంద్రబాబు రేపటి రోజున ఇదే సాకుగా చెప్పి , రాష్ట్ర ఖజానాకి భారం అంటూ వారి అనుకూల చానల్స్ లో ప్రచారం చేయించి ఈ వ్యవస్థని ఒక్క కలం పోటుతో రద్దు చేస్తే తమ పరిస్థితి ఏంటని వారు ఆవేదన చెందుతున్నారు.
గతంలో ఆయన రాసుకున్న మనసులో మాట పుస్తకంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేయడం వృథా. ప్రభుత్వోద్యోగ మనగానే శాశ్వతం, భద్రం అనే భావన పని చేయనీయకుండా చేస్తున్నది. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల వల్ల ప్రభుత్వం అప్పుల వలలో చిక్కుకుపోయే పరిస్థితికి దారితీనింది. ఉద్యోగుల పెరుగుదలతో సామర్థ్యం పెరగడం లేదు. సిబ్బంది పెరుగుదలను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా 1994లోనే ఒక చట్టం తెచ్చాం. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, విశ్వ విద్యాలయాలు, స్థానిక సంస్థలు నియామకాలు చేయకుండా ఈ చట్టం నిరోధిస్తుంది.” అంటూ ప్రభుత్వ ఉద్యోగులపై విషం చిమ్మిన చంద్రబాబు ఇప్పుడు తమపై కూడా కత్తి కట్టడని గ్యారెంటీ ఏంటని వారు ఆవేదన చేందుతున్నారు.