రాష్ట్రం లో పేదోడి వైద్యానికి దిక్కు లేదు.. ప్రభుత్వాసుపత్రులన్నీ నరక కూపాలు..
అంటూ టీడీపీ పత్రిక చైతన్య రథం లో ఓ గొప్ప ఆర్టికల్ ప్రచురించింది. వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదట ఒట్టి మాటలేనట..
మరే ఎందుకు కాదు : ప్రభుత్వ ఆసుపత్రులు నరకకూపాలే.. ఎందుకంటే మన పాలనలో లాగా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు ఎలుకలు కొరికి చనిపోలేదు కదా అవి నరకకూపాలు కాక మరెంటి?
మన్యం లో బాలింత వైద్యం అందక మన బాబు హయాంలో లో చనిపోయినట్టు ఇప్పుడు చనిపోవడం లేదు ఇదేం చిత్తశుద్ధి అండి బాబూ?
108 అంబులెన్స్ లని బాబు లాగా పడావు పడెయ్యలే కదా? అందుకే రోడ్లు నెత్తురోడటం లేదు ఠయానికి అంబులెన్స్ లు వస్తున్నాయి రావొచ్చా అట్లా? మన హయాం లో ఎట్లుండే? జనాలు 108 కాల్ చేయడమే టైం బొక్క యాపారం అని ఆటోల్లో జీపుల్లో ఎక్కించేసేవాళ్లు… అది కదా పద్దతంటే…
అబ్బే ఈ జగన్ కి అస్సలు మన లా మానవత్వం లేదండీ, కోవిడ్ సమయం లో ఇంటింటికీ ఆరోగ్య భద్రత కల్పించాడు, క్వారంటెన్ సెంటర్లను ఏర్పాటు చేశాడు, ప్రైవేట్ కాలేజీలను కూడా క్వారంటైన్ కేంద్రాలుగా మార్చి, కోవిడ్ భాదితులను అందులో చేర్చి కావల్సిన మందులతో పాటు పౌష్టికాహారం కూడా అందించి వారికి నయమయ్యే దాకా రూపాయి ఖర్చు లేకుండా వైద్యమందించాడు… పద్దతేనా అది? ప్రైవేట్ హాస్పిటల్ కి పోండి మనకాడ ఇంకా ఆ టెక్నాలజీ లేదు.. నేను కనిపెట్టే వరకు మనోళ్ల హాస్పటల్స్ లో నా పేరు జెప్పి జేరండి.. లాస్ట్ లో పదో పరకో బిల్లేస్తారు.. ఇచ్చేయండి అనాలి గానీ?
ఇది మరీ ఇడ్డూరం అండీ బాబో… కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాడు, మనం పద్నాలుగేళ్ల లో ఒక్క ఆస్పత్రి కట్టామా? లేదే? అదే టైం లో మనోళ్ల హాస్పిటల్స్ కోసం ఎంత మందికి డెడ్ చీప్ గా భూములిచ్చాం? అధికదా చిత్తశుద్ది అంటే…….
ఊరికో ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలని, మానవతా దృక్పథం తో ఆలోచించి ముందుకు రావాలని డాక్టర్లను వేడుకొన్నాడు అంట.. అసలు సీఎం అలా అడగొచ్చా? తోకలు కత్తిరిస్తా అనాలి గానీ? అటవీ ప్రాంతం లో పనిచేసే డాక్టర్లకి మైదాన ప్రాంతంలో చేసే వారికన్నా ఎక్కువ జీతం ఇస్తామని పిలుస్తాడా? అసలు ఇలాంటి ఆలోచన రావొచ్చా? హెంత హన్యాయం..
ఫ్యామిలీ డాక్టర్ అని ఓ వినూత్న ఆలోచన చేపట్టి, ఇంటికే డాక్టర్ ను పంపుతున్నాడట… విలేజి క్లీనిక్ లు కట్టాడట.. 3000 మందిని వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా నియమించాడట… ఎంత ఘోరం?
ఆరోగ్య శ్రీ లో కొత్తగా 2000 పైగా వ్యాధులను చేర్చాడట, 1000 ఖర్చు దాటిన ప్రతీ రోగానికి ఆరోగ్యశ్రీ లో అనుసంధానం చేశాడట… మనం ఎగగొట్టి పోయిన ఆరోగ్య శ్రీ పెండింగ్ బిల్లులను క్లియర్ చేశాడట…11 వేల కోట్లకు పైగా ఒక్క ఆరోగ్య శ్రీ నుండే ఖర్చు చేశాడట…హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి వెళ్తున్న వారికి దారి ఖర్చులూ ఇస్తున్నాడట.. … ఎక్కడైనా ఉందా తమ్ముళ్లు ఇదీ? టాక్స్ పేయర్ల డబ్బు విచ్చలవిడిగా పంచుతాడా? హమ్మా??
మండలానికో ఆంబులెన్స్ ఉండేలా WHO నిర్దేశించిన లెక్క కన్నా ఎక్కువ అంబులెన్స్ లని రాష్ట్రం లో నిలిపాడట… 104 వాహనాలను పెంచాడట… అసలు ఎన్ని అంబులెన్స్ లు ఉండాలో చెప్పడానికి WHO ఎవరు తమ్ముళ్లు! ? మనకన్నా మేధావా?
అసలు చిత్తశుద్ధి అంటే ఎలా ఉండాలి? .. మన అనునాయుల కార్పొరేట్ ఆస్పత్రుల బాగు కోసం ప్రభుత్వ ఆస్పత్రుల మెరుగు కోసం తాపత్రయ పడకూడదు… పేదవాడి ఆరోగ్యం కోసం లక్షలు లక్షలు ఖర్చు అయ్యి అప్పుల పాలు అయితే వారి జీవితాలు చిద్రం అయితే అయ్యాయి లే అనుకుని మనోళ్ల బాగు కోసం పని చేయాలి..
అందుకే జగన్ కు ఈ వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు తమ్ముళ్లు… అబ్బే ఈ అలగా జనాలకి కాస్ట్లీ వైద్యం ఏంది? ఇంటింటికీ డాక్టర్ని ప్రభుత్వమే పంపిస్తే ఇక జనాలు కంట్రోల్ లో ఎలా ఉంటారు… ఛీ ఛీ ఛీ… ఇదేం మంచి పద్దతి కాదయ్యా లోకేశేర్రావ్ గారో….