ప్రపంచంలో చంద్రబాబు తప్ప ఇంక ఎవరు ఏ గొప్ప పని చేసినా అందులో లోటుపాట్లను ధుర్భిని వేసి మరీ చూసే తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు పులివెందులలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పైనా తమ విషం కక్కారు. పులివెందుల మోడల్ టౌన్లో భాగంగా… పులివెందులలో పలుచోట్ల మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
అందులో భాగంగా తెలంగాణలో తయారు చేయించిన గాంధీ, అంబేద్కర్, వైయస్ విగ్రహాలను శుక్రవారం సాయంత్రం పులివెందులకు తీసుకొచ్చారు. ఆయా విగ్రహాలను ఏర్పాటు చేద్దామనుకున్న కూడళ్ళ మధ్య వాటిని నిలబెట్టేందుకు పిల్లర్లను కూడా నిర్మిస్తున్నారు.
గాంధీ విగ్రహం కోర్టు సర్కిల్ దగ్గర, పాత బస్టాండు సమీపంలో వైయస్ విగ్రహాల కోసం కట్టిన పిల్లర్లు సిద్ధంగా ఉండటంతో వాటిని క్రేన్ సహాయంతో పిల్లర్లను నిలబెట్టారు కూడా. అంబేద్కర్ విగ్రహాన్ని గరండల్ బ్రిడ్జి సమీపంలో.. సుందరీకరణ చేసి ఏర్పాటు చేయాల్సి ఉండగా అవి సిద్దం అవకపోవడంతో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పాత బస్టాండు సమీపంలో వైయస్ విగ్రహంతో పాటు క్రేన్ సహాయంతో దించేసారు, ఆ తర్వాత సరైన చోటుకి తీసుకెళ్ళాలని కాంట్రాక్టర్ ఆలోచన.
అయితే ఎటువంటి విషయం అయినా తమకు నచ్చినట్టుగా మార్చుకునే తెలుగు తమ్ముళ్ళు ఈ తతంగాన్ని అతి ఉత్సాహంతో ఫోటోలు తీసి, వైయస్ విగ్రహం పైన అంబేద్కర్ విగ్రహం కింద ఏర్పాటు చేశారు. ఇది అంబేద్కర్ కు అవమానం అంటూ సోషల్మీడియాలో వదిలి ఆనందపడ్డారు. అసలు విషయం తెలుసుకున్న ప్రజలు మాత్రం వీడియో తీసిన స్థానిక టీడీపీ ఎమ్మెల్సీ స్వభావాన్ని తిట్టుకుంటున్నారు.