టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులును కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వదలడం లేదు . రమణ దీక్షితులు మాట్లాడుతున్నట్లున్న ఒక ఫేక్ వీడియోను రిలీజ్ చేసి అసత్య ప్రచారానికి టీడీపీ తెగబడింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్ అని, కడప ఎంపీ అవినాష్ పై కేసులు లేకుండా రాజీ చేస్తుంది ఆయనే అని, ధర్మారెడ్డి సంప్రదాయ దుస్తులు ధరించరు, టీ షర్ట్ పైనే ఉంటారని ఆ వీడియోలో రమణ దీక్షితులు చెబుతున్నట్లు వీడియో క్రియేట్ చేసారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని రమణ దీక్షితులు పోలిన స్వరంతో వచ్చే విధంగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు అసత్య ప్రచారం చేస్తున్నారు. రమణ దీక్షితులు స్పందిస్తూ తనకు, ఆ వీడియోకు ఎటువంటి సంబంధం లేదని, నాపై అసూయతో నా పరువు తీయడానికి, టిటిడి అడ్మినిస్ట్రేషన్తో ఉన్న సంబంధాన్ని చెడగొట్టడానికి ఈ చీప్ ట్రిక్ చేసారని వెల్లడించారు. అలా ఫేక్ వాయిస్ & వీడియో క్రియేట్ చేసి, అన్ని మాధ్యమాల్లో షేర్ చేస్తున్న వారిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఏది ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ని కూడా టీడీపీ తన అసత్య ప్రచారానికి వాడుకోవడం చూసి ప్రజలు అవాక్కవుతున్నారు.