సీఎం జగన్పై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రశంసలు కురిపించారు. ఆంధ్రజ్యోతిపై టీటీడీ బోర్డు 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. టీటీడీపై అసత్య ప్రచారాలు చేయడంలో ఆంధ్రజ్యోతికి పరిపాటిగా మారింది. టీటీడీ తరుపున ఈ కేసులో ఇంప్లీడ్ అయినా సుబ్రమణ్య స్వామి ఈ రోజు కోర్టు వాయిదాకు హాజరయ్యారు.ఈ రోజు విచారణ అనంతరం కోర్టు 27వ తేదికి వాయిదా వేసింది.
కోర్టులో వాదనల అనంతరం బయటికి వచ్చిన సుబ్రమణ్యస్వామి మీడియాతో ముచ్చటించారు. ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ సీఎం జగన్ చాలా హర్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రజల్లో మంచి క్రెడిబిలిటీ ఉంది. మరోసారి అది నిరూపించుకుంటారని చెప్పుకొచ్చారు.
ఇదే సమావేశంలో సుబ్రహ్మణస్వామి మాట్లాడుతూ ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులపై సంచలన కామెంట్స్ చేశారు. 2014లో బీజేపీతో జత కట్టిన చంద్రబాబు , 2019 లో కాంగ్రెస్తో పొత్తులో భాగంగా సోనియా గాంధీతో కలిశారు. ఇప్పుడు మళ్ళి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. చంద్రబాబుకు క్రెడిబిలిటీ లేదు, ప్రజల్లో నమ్మకం కోల్పోయాడు అని వ్యాఖ్యానించారు.