ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్కార్ బడులు గతంకి ఇప్పటికీ ఊహించని మార్పులు జరిగాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విషయంలో ఎన్నడూ జరగని, భవిష్యత్తులో ఊహకందని అభివృద్ధిని చేసింది జగన్ సర్కార్. ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడుతో మొదలు, ఇంగ్లీష్ మీడియం, ఇంటర్ ఆక్టివ్ ప్యానెల్స్ పై బోధన, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు టీవీలలో బోధన, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా పౌష్టికమైన ఆహారము, బైజుస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లూ, సీబీఎస్ఈ సిలబస్, ఐ వి సిలబస్, ప్రపంచ దేశాలలోని భాష పిల్లలకు అర్థమయ్యే విధంగా టోఫెల్ లో శిక్షణ ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో. ఇప్పుడు వీటికి అదనంగా ప్రభుత్వ పాఠశాలలో స్టెమ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయబోతుంది జగన్ ప్రభుత్వం.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల స్థాయిలో విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్,మ్యాథమెటిక్స్ ఇలా ఈ నాలుగు సబ్జెక్టులు పైన ఎక్కువ అవగాహన వచ్చేలా ,వీటి ఆధారిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్టెమ్ ఆధారిత విద్యను బలోపేతం చేయడంతో పాటు సాంకేతిక సహకారం ఉచితంగా అందించేందుకు కనెక్టు ఆంధ్ర, సేవ్ ది చిల్డ్రన్ , అగస్త్య ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలతో సమగ్ర శిక్ష సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించడంలో దేశంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిందని దీనికి మరింత తోడ్పాటుగా ఫ్యూచర్స్టిక్ ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు స్టెమ్ వంటి కీలక సబ్జెక్టులో అనుభవాత్మక విద్యను అందించేందుకు ఈ ఒప్పందం దోహద పడుతుంది అని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 1000 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్టెమ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తే, ఆ స్టెమ్ ల్యాబ్స్ కు సేవ్ ది చిల్డ్రన్, ఆగస్టు ఫౌండేషన్ సాంకేతిక సహకారం అందించనున్నాయి అని శ్రీనివాస్ రావు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కనెక్టు ఆంధ్ర డైరెక్టర్ కోట్ల శివశంకర్ సేవ్ ది చిల్డ్రన్ డైరెక్టర్ అవినాష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.