సామాజిక న్యాయం మాటలతోనే సాధ్యం కాదని రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు శ్రీకాకుళం నగరంలోని టౌన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ధర్మాన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం మాటలతోనే సాధ్యం కాదు. మాటలు చెప్పినంత మాత్రాన సామాజిక న్యాయం రాదు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాటలు చెబుతుండే వారే తప్ప,స్వతహాగా బీసీలు సామాజికంగా ఎదగాలన్న ఆలోచన ఆయనకు లేదు. చంద్రబాబు పద్నాగేళ్లు ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాలు రాజకీయాలలో అనుభవం ఉన్న ఆయన ఏనాడూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదు. అందుకు ఉదాహరణగా రాజ్యసభకు ఒక్క బీసీని కూడా పంపేందుకు చంద్రబాబు ఇష్టపడలేదని ధర్మాన వెల్లడించారు.
కానీ సీఎం జగన్ ఐదేళ్ళలో ఐదుగురు బీసీలను పెద్దల సభకు పంపారు. ఈ ఐదు సంవత్సరాలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ బద్దంగా బీసీల ఎదుగదలకు అటు రాజ్యాధికారం ఇచ్చి,ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కలిగించి,సామాజిక న్యాయం అందించింది. సామాజిక న్యాయం దక్కించడమే వైయస్ఆర్ సీపీ ధ్యేయం. చంద్రబాబు జయహో బీసీ అంటున్నారు. రాజ్యాధికారం ఇవ్వకుండా జయహో బీసీ ఎలా అవుతుంది? ఇలాంటి జయహో బీసీ సభలు ఇంతకుముందు చాలా సార్లు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. ఎన్నిక అయిపోగానే సంబంధిత కాగితాలు చింపి అవతల పారేశారు. డిక్లరేషన్ల ఊసే లేదు.
జగన్ పాలనలో మూడు సంవత్సరాల తరువాత రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని వెనుజులా అవుతుందని దివాలా తీసేస్తుందని చెప్పారు. కానీ భారత ప్రభుత్వం ప్రకటించిన సూచీలు (ఇండికేటర్స్) చూస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని తెలుస్తుంది. రాజమండ్రి సభలో ఇంత కన్నా ఎక్కువ ఇస్తానని చంద్రబాబు మాట మార్చారు. ఆ నాలుగు సంవత్సరాలలో నాలుగు దఫాలుగా మాట మార్చారు. ఇప్పుడు జయహో బీసీ అంటూ చెబుతున్న మాటలు మార్చరని ఏంటి గ్యారంటీ ? ఈ జయహో బీసీని ప్రజలెవ్వరూ నమ్మవద్దు. జయహో బీసీలో కపటం ఉంది, అందులో మాయ ఉంది. అందులో మోసం ఉంది. అధికారం కోసం చెప్పే మాటలు ఉన్నాయి తప్ప నిజమైనటువంటి సామాజిక న్యాయం,రాజకీయ అధికారం,ఆర్థిక స్వతంత్రం కలిగించే ఆలోచనలు లేవు. బీసీలకు జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి సూచీలు నేను చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాకు వెల్లడించారు.