ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఖండించారు. వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయం కాకపోయి ఉంటే.. టీడీపీపై క్రిమినల్ కేసు పెట్టేవాళ్లమని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం తీసుకొచ్చిన చట్టమంటూ ధర్మాన ప్రసాద్ తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పాం.. మళ్లీ ఇప్పుడు స్పష్టం చేస్తున్నామన్నారు. భూముల […]
సామాజిక న్యాయం మాటలతోనే సాధ్యం కాదని రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు శ్రీకాకుళం నగరంలోని టౌన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ధర్మాన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం మాటలతోనే సాధ్యం కాదు. మాటలు చెప్పినంత మాత్రాన సామాజిక న్యాయం రాదు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాటలు చెబుతుండే వారే తప్ప,స్వతహాగా బీసీలు సామాజికంగా […]
సిక్కోలుకు నువ్వేం చేశావో చెప్పు బాబు అంటూ.. మంత్రి ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు ఐదేళ్ళ పరిపాలనను ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా శ్రీ పురం(సానివాడ) పంచాయతీలో రూ. 80 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం శ్రీకాకుళంకు ఏం చేసిందంటూ ప్రశ్నించారు. వైఎస్పార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి […]