ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ సీయం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక హోదా విషయమై ప్రత్యేక లేఖ ఒకటి రాసి ఈరోజు విడుదల చేసారు. అది కూడా లెటర్ వెనుక చేతి గుర్తుతో. మరి పదేళ్ళుగా షర్మిళ చేతులు ఏ చెట్టు పువ్వులను కోస్తూ బిజీగా ఉన్నాయో మరి.
అసలు అడ్డగోలుగా ఆంధ్రని విడదీసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని అసలు షర్మిళ ఎప్పుడూ ఏమీ అడగలేదు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వనిది బీజేపీ పార్టీ. అసలు ఆవిడకి ఆ పార్టీ ఊసే లేదు. ఇక అన్నిటికన్నా విచిత్రం. హోదా అంటే జైలుకే అని చంద్రబాబు ఒక్కసారి కాదు వందసార్లన్నారు. ఆయన్ని ఎప్పుడూ అడగలేదు.
అదే హోదా కోసం వెళ్ళిన జగన్ ని విశాఖ రన్వే మీదే నిలువరించారు ఘనత వహించిన బాబు గారు. అప్పటి విషయాలన్నీ మరిచిపోయారు షర్మిళ గారు. హిపోక్రసీ తో ముందొక మాట వెనకొక మాట చెప్పింది బాబు. పైగా ఇప్పుడు ఆయన ఆదేశాలనుసారమే కాంగ్రెస్లో చేరారు షర్మిళ. తెలంగాణలో పార్టీ పెట్టి తాను తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవం అంటూ అక్కడ తిరిగి మళ్ళీ ఇప్పుడు సడెన్ గా ప్రత్యేక హోదా మీద ఈ శ్రధ్ధ ఎందుకో మరి.