ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే గడువుంది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులతో, తాము ఎన్నికలకు ‘సిద్ధం’గా ఉన్నామని అధికార వైసీపీ ఎన్నికలకు సమాయత్తమవుతుండగా, రా కదలిరా.. శంఖారావం అంటూ చంద్రబాబు లోకేష్ టీడీపీ శ్రేణులను ఉత్తేజితం చేస్తున్నారు. కాగా కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఇచ్చిన ఆదేశాలకు ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో అన్న అనుమానం ప్రజల్లో కలగడం ఖాయంగా కనిపిస్తుంది. ఎన్నికల విధుల్లో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను వినియోగించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.
సీఎం జగన్ అధికారంలోనికి రాగానే గ్రామ వార్డు సచివాలయాలకు శ్రీకారం చుట్టి పాలనలో సమూల మార్పులను తీసుకొచ్చారు.ప్రతిభ ఆధారంగా గ్రామవార్డు ఉద్యోగులను ఎంపిక చేసినా ప్రతిపక్షాలు మాత్రం జగన్ సర్కారుపై విమర్శలు చేస్తూనే వచ్చాయి. తాజాగా ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల విధుల్లో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకునేందుకు కొన్ని షరతులతో నో అబ్జెక్షన్ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ ఆఫీసర్కు అసిస్టెంట్గా మాత్రమే గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించాలని, గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులను బూత్ స్థాయి అధికారులుగా నియమించకూడదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులిచ్చింది.
ఉపాధ్యాయులతో సమానంగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు గుర్తింపు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ కి దక్కిందని చెప్పొచ్చు. కాగా ఎన్నికల విధుల్లో వీరిని ఉపయోగించుకోవచ్చని ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో తలెత్తుతుంది. కాగా గ్రామ/వార్డు వలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడంతో టీడీపీ జనసేన వర్గాలకు ఊరటనిచ్చే వార్తగా భావించవచ్చు.