గత నెల నుండి ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. శివ రాత్రికి ముందు నుండే పెరిగిన ఎండలతో బెంబేలెత్తుతున్న జనం బైటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. తప్పనిసరైతే తప్ప ఎండకు బైటకు వెళ్లకూడదని, వడదెబ్బ తగలకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒక వైపు వర్షలు తక్కువ పడడంతో నీటి ఎద్దడితో, మరో వైపు మండుతున్న ఎండలతో ప్రజలు సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ఎండలు గతేడాది కంటే ఎక్కువగా ఉండనున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. ఈ క్రమంలో ఎండలు ఎక్కువున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల హీట్ ఒకవైపు ఉంటే, మరోవైపు ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహిస్తోంది .ఎండల ప్రభావం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్ కు పంపడానికి భయపడిపోతున్నారు. ఇంకా ఎండలు అధికం అవుతున్న నేపథ్యంలో ప్రతి ఏడు లాగే ఈ ఏడాది కూడా పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వరకు ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. పాఠశాలల పునః ప్రారంభం త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది.