5 ఏళ్లలో ఏపీ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అయింది,బ్యాంకు డిపాజిట్లలో 58% వృద్ధిని సాధించిందని226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఇచ్చిన నివేదికే దానికి నిదర్శనం..
అలాగే క్రెడిట్ టు డిపాజిట్ రేషియో 158% కి పెరిగింది. డిపాజిట్ల పెరుగుదల ప్రజల ఆదాయం పెరుగుదలకు నిదర్శనం కాగా, రుణాలు ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు నిదర్శనం.
సీడీ రేషియో అధికంగా ఉందంటే ఆ రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అధికంగా జరగుతున్నాయనే అర్ధమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.గత ఐదేళ్లలో డిపాజిట్లలో ఏకంగా 58.23 శాతం వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి డిపాజిట్లు -రూ.3,12,642 కోట్లు కాగా, 2023 డిసెంబర్ నాటికి డిపాజిట్లు- రూ.4,94,690 కోట్లుగా నమోదైంది..అంటే రూ.1,82,048 కోట్లు (58 శాతం )పెరిగాయి.
అన్ని రంగాలకు బ్యాంకు రుణాల మంజూరులో ఏకంగా 97 శాతం భారీ వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి రుణాల మంజూరు- రూ.3,97,350 కోట్లు కాగా, 2023 డిసెంబర్ నాటికి రుణాల మంజూరు-రూ.7,81,313 కోట్లు గా నమోదు అయింది.. అంటే రుణాలు రూ.3,83,963 కోట్లు ( 97 శాతం) పెరిగాయి.
బ్యాంక్ రుణాలు పెరుగుదల రాష్ట్రం లో వాణిజ్య కార్యకలాపాల పెరుగుదల నమోదు కు నిదర్శనం. బ్యాంక్ లు రుణాలు ఇవ్వడానికి అధిక ఆసక్తి చూపడానికి కారణం తిరిగి చెల్లిస్తారు అనే భరోసా బ్యాంకర్లకు ఉండటమే. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల తాలుకా డీబీటీ సొమ్ము అంతా ప్రజలు పొదుపు కోసం వినియోగించడంతో బ్యాంక్ ల వద్ద లిక్విడిటి ఎక్కువగా ఉంటుంది, ప్రజల సొమ్ము ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా ప్రజలకు పంచడం తో ఆ సొమ్ము ఆర్ధిక వ్యవస్థలోకి తిరిగి ఫ్లో అవుతుంది. తద్వారా బ్యాంక్ లు అభివృద్ధి కార్యకలాపాలకు రుణాలు మంజూరు చేస్తున్నాయి.