నిన్న కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం సందర్భంగా షర్మిల వై.యస్ జగన్ పై పలు విమర్శలు చేసిన నేపధ్యంలో, అసలు ఆ విమర్శలలో నిజం లేదంటూ సజ్జల అన్నారు. ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, వైఎస్సార్ కుటుంబానికి అన్యాయం చేసిందన్నారు.
అంతే కాక ఆయన షర్మిళను సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగారు.
అసలు కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు?
తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిళ అక్కడి నుంచి ఏపీకి హఠాత్తుగా ఎందుకొచ్చారు?
ఆంధ్రాలో భూస్థాపితం అయిపోయినపార్టీ తరఫున షర్మిల ఇక్కడకు వచ్చి ఏం చేస్తారు?.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఎందుకు గుర్తించలేదు?
తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనకడుగు వేశారు?
ఏపీలో ఎవరికి ఆయుధంలా ఉపయోగపడాలని వచ్చారు?
చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రమే షర్మిళ ఆంధ్ర రాజకీయమా?
అంటూ అడిగారు.
ఇదంతా చంద్రబాబు ఎత్తుగడేననీ, అందుకే ఎల్లో మీడియా షర్మిలను భుజానికి ఎత్తుకుందనీ,
చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారనీ అన్నారు.
అంతేకాక, ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందనీ, టీడీపీ వెంటిలేటర్పై ఉందనీ, గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్కు వచ్చాయనీ వాస్తవ పరిస్థితులను మీడియా ముందుంచారు. కేంద్రంతో సఖ్యతగా ఉండి సీఎం జగన్ రాష్ట్రానికి మేలు చేస్తున్నారనీ తెలిపారు. చివరగా వైఎస్సార్ తనయురాలిగా, వైఎస్ జగన్ చెల్లెలిగా షర్మిలను అభిమానిస్తాం అంటూ సజ్జల మీడియా సమావేశాన్ని ముగించారు.