పాడిందే పాట పాచిపళ్ళ దాసుడా అన్నట్లు జగన్ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని టీడీపీ అనుకూల మీడియా & సోషల్ మీడియా వదులుకోవడం లేదు. జరిగిన నిజం కళ్ళకు కనబడుతున్నా అసత్య కథనాలతో గోబెల్స్ ప్రచారానికి తెరతీస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా విశాఖ పర్యాటకాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మొదటిరోజే తెగిపోయిందంటూ టీడీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారానికి తెరలేపగా దానికి వంతపాడుతూ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అసత్య కథనాలను ప్రసారం చేయడం గమనార్హం.
వాస్తవానికి విశాఖకు పర్యాటకులను ఆకర్షించేందుకు సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్లను పరిశీలించి సాయి మోక్షా షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సంస్థకు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కాంట్రాక్టును అప్పగించింది. సబ్మైరెన మ్యూజియానికి సమీపంలో బ్రిడ్జ్ ఏర్పాటు చేసి రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభించారు. అనంతరం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పటిష్టతను తెలుసుకునే క్రమంలో మాక్ డ్రిల్ నిర్వహించిన అనంతరం సందర్శకులను అనుమతించాలని అధికారులు భావించి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నుంచి టీ జాయింట్ ప్లాట్ఫాంను డీ లింక్ చేసి అక్కడకు దగ్గరలో ఏర్పాటు చేసిన యాంకర్లకు దగ్గరగా జరిపారు. డీ లింక్ అయిన టీ జాయింట్ ప్లాట్ఫాంను చూపిస్తూ సోషల్ మీడియాలో టీడీపీ అనుకూల వర్గం దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టడంతో ప్రజల్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పట్ల భయాందోళనలు రేకెత్తాయి.
విశాఖను అభివృద్ధి చేసేక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్పై చేస్తున్న దుష్ప్రచారాన్ని జిల్లా కలెక్టర్, మెట్రోపాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎ.మల్లికార్జున ఖండించారు. సోషల్ మీడియా & టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని, సీసీ కెమెరాలో రికార్డ్ కాబడిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ డీ లింక్ చేస్తున్న దృశ్యాన్ని విడుదల చేశారు. బ్రిడ్జ్ పటిష్టతపై చేపట్టిన మాక్ డ్రిల్పై అసత్యప్రచారం తగదని భవిష్యత్తులో కూడా ఇలాంటి మాక్ డ్రిల్లు జరుగుతాయని స్పష్టం చేశారు.