“లల్లూ అంకుల్ మాలుమ్ తేరేకూ, జయా ఆంటీ మాలుమ్ తేరేకూ” అంటూ విపరీతమైన విశ్వాసంతో, గత అయిదేళ్ళు గా ఢిల్లీలోనే ఉంటూ… నాకు వారు తెలుసు వీరు తెలుసు అంటూ, సీయం జగన్ని నోటికి ఇష్టం వచ్చినట్టు విమర్శించిన ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ఈ రోజు ఢిల్లీలోనే చేదు అనుభవం ఎదురయింది.
అయిదేళ్ళుగా ఎంపీగా అక్కడే తిష్ట వేసినా, అక్కడి పెద్దలతో నిత్యం ఏదో ఒక రకంగా టచ్ లో ఉన్నా కూడా ఈరోజు గేటు బయటనే రఘురామ కృష్ణంరాజు ఉండిపోవలసి వచ్చింది. అమిత్ షా నివాసంలోకి రఘురామ కృష్ణంరాజుకు నో ఎంట్రీ అనడంతో పాపం,రోడ్డు మీద ఉండి తనను అనుమతించాలని ఫోన్లు చేసే ప్రయత్నాల్లో పడ్డారు ఆరారార్.
తమకు ఉపయోగం ఉన్నంత వరకూ విస్తరాకు అని, పని అయిపోయాక ఎంగిలాకు అని పిలిచే అలవాటున్న చంద్రబాబు, తమ వెంట వచ్చిన రఘురామ కృష్ణంరాజును అనుమతించనపుడు, కనీసం… “అతను కూడా మా వాడే” అని అయినా అనకుండా, తేలిగ్గా బయటే వదిలేసి తన దత్త పుత్రుడు పవన్తో చలాకీగా లోపలికి వెళ్ళిపోయారు.దీంతో ఆశ్చర్యపోయి అవమాన పడ్డ రఘురామ కృష్ణంరాజు పాపం అలా బయటనే ఉండిపోయారు.