ప్రశాంత్ కిషోర్ అంటే వ్యక్తి కాదు వ్యవస్థ. అది అతను ఐ ప్యాక్ అనే సంస్థలో ఉన్నన్ని రోజులు వర్తించింది. అసలు భారతదేశంలో ఎన్నికలకి కూడా సలహాలు ఇచ్చి డబ్బులు సంపాదించవచ్చు అని నిరూపించింది ప్రశాంత్ కిషోరే. మెరికల్లాంటి కుర్రాళ్ళు, గ్రూప్ పరీక్షలు రాయడానికి సన్నధ్ధమయ్యే విద్యార్థులు, అనుభవం ఉన్న రాజకీయ విశ్లేషకులు ఐప్యాక్లో పని చేసేవారు. సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉద్యోగాలు చేసి, భారత అత్యున్నత సర్వీసెస్లో ఉద్యోగాలు కోరుకునే మెరికల్లాంటి యువతీ యువకులను ఐ ప్యాక్ సంస్థ ఉద్యోగులుగా తీసుకునేది. ఆ సంస్థ సలహాలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్న రాష్ట్ర చరిత్ర, భౌగాళిక స్వరూపాలు, రాజకీయ వివాదాలు, లభించే వనరులు, జరిగిన అభివృద్ధి, సంక్షేమ పధకాల స్థితిగతులు ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వేలు చేసేవారు. కలెక్టర్ కావాలనుంటున్న కుర్రాళ్ళు ఇలాంటి అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది అని ఐ ప్యాక్లో చేరేవారు కూడా. అలా ఆ సంస్థ చేసిన సర్వేలో ఫలితంగా ఇచ్చిన సలహాలు విన్న పార్టీలు తొంభైం శాతం సక్సెస్ రేట్తో అధికారంలోకి కూడా వచ్చాయి. అలా ప్రశాంత్ కిషోర్ ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. అయితే అదంతా గతం. ఇపుడు అతను ఐ ప్యాక్లో లేడు. అతనికున్న అనుభవాన్ని ఉపయోగించుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు.
2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత పోల్ మేనేజ్మెంట్ కు దూరంగా ఉన్నాడు . ఐప్యాక్ సంస్థను అతని శిష్యుడు అయినటువంటి రిషిరాజ్ సింగ్ టేక్ ఓవర్ చేసుకున్నాడు. రిషిరాజ్ సింగ్ మరియు రాబిన్ శర్మ వీళ్లిద్దరూ ప్రశాంత్ కిషోర్ వద్ద పనిచేసినవారే ప్రస్తుతం వారిద్దరూ ఆంధ్రప్రదేశ్లో ఒకరేమో అధికార పక్షానికి మరోకరేమో ప్రతిపక్షానికి పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఐప్యాక్ కి ప్రశాంత్ కిషోర్ కి ఎటువంటి సంబంధం లేదు.
బీహార్ లో అతను సొంత పార్టీ పెట్టుకొని సూరజ్ యాత్ర పేరుతో 3500 కి.మి పాద యాత్ర మోదలు పెట్టి మధ్య లోనే గాలికొదలేసాడు. అంతటి ఘనత ప్రశాంత్ కిషోర్ ది. అతను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ ఎక్కడ నుంచున్నా డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితులు లేవు బీహార్ లో పార్టీ ఇనాగురేషన్ మీటింగ్ పెడితే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నుంచి వచ్చే ఏ అభిప్రాయమైనా అది వ్యక్తిగతమైనదే తప్ప, ఇంతకు మునుపు లా సంస్థ తాలూకా నిపుణుల పర్యవేక్షణలో రాసిన రిపోర్ట్ కాదు. అందుకే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే. అతని వెనకున ఉన్న అసాధారణ ప్రతిభ కల టీమ్ ఇప్పుడు లేదు. 2023 తెలంగాణ ఎన్నికల్లో మరలా బి.ఆర్.ఎస్ దే విజయం అని ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాట ఎంత నిజమో ఆంధ్రా లో జగన్ ఓడిపోతాడు అనే మాట కూడా అంతే నిజం.