సీఎం జగన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఫార్మా రంగానికి హబ్ గా మారనుంది. అరబిందో గ్రూపుతో పాటు దివీస్ సంస్థ కూడా కాకినాడ సమీపంలో తమ ఫార్మా యూనిట్లను ఏర్పాటు చేయడంతో ఫార్మా రంగంలో ఏపీ ముందంజలో ఉండబోతుంది. తాజాగా కాకినాడ సమీపంలోని తొండంగి వద్ద అరబిందో గ్రూపు లిఫియస్ పేరుతో పెన్సులిన్ జి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
250 ఎకరాల్లో సుమారు రూ.2,205 కోట్లతో అరబిందో గ్రూపు ఏర్పాటు చేసిన లిఫియస్ యూనిట్ ఇప్పటికే నిర్మాణాన్ని పూర్తి చేసుకొని వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైంది. తద్వారా ప్రతీ ఏటా 15,000 టన్నుల పెన్సులిన్ జి, 2,000 టన్నుల 7–ఏసీఏ(అమైనోసెఫాలోస్పోరానిక్ యాసిడ్) ఉత్పత్తి ఈ కర్మాగారం ద్వారా జరగనుంది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా సుమారు 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఉద్యోగ నియామకాలను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్లు లిఫియస్ ప్రకటించడం గమనార్హం.
లిఫియస్ యూనిట్ సమీపంలోనే మరో రెండు ఫార్మా యూనిట్లు ఏర్పాటవుతుండడం గమనార్హం. లిఫియస్ను ఏర్పాటు చేసినAP అరబిందో గ్రూపు క్యూలే పేరుతో మరో యూనిట్ని నెలకొల్పడం విశేషం. ఎరిత్రోమైసిన్ థియోసేనేట్ యూనిట్ని 1600 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో 159 ఎకరాల్లో సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడితో అరబిందో గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే శరవేగంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ రెండు యూనిట్లకు సమీపంలో దివీస్ సంస్థ కూడా ఓ ఫార్మా యూనిట్ ను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ఫార్మా రంగం మరింత ముందుకు దూసుకుపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.