చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు పండిన ప్రజలు నమ్మబోరని ఈ ఎన్నికల్లో మరోసారి చంద్రబాబుకి ఘోర ఓటమి తప్పదని ఏపీ ఎస్టి కమిషన్ సభ్యుడు శంకర్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో 600 పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిలో ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. 2014లో పొత్తులో భాగంగా బిజెపితో కూటమిలో ఉన్న చంద్రబాబు బిజెపి రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోయినా, వాళ్లతో విభేదించినట్లు నటించి కాంగ్రెస్తో జతకట్టి నేడు తిరిగి మళ్లీ ఏ మొహం పెట్టుకొని బిజెపి చెంతకు పోయాడని ఈ సందర్భంగా శంకర్ నాయక్ ప్రశ్నించారు.
2014 ఎన్నికల హామీల భాగంగా చంద్రబాబు గిరిజనుల కోసం అనేక హామీలు ఇచ్చాడని ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. గతంలో చంద్రబాబు గిరిజనుల నివసించే ప్రదేశాల్లోనూ, ఏజెన్సీ ఏరియాలలోను గిరిజనులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అన్నిటిని అధికమిస్తామని ప్రకటించారు, తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కనీస సౌకర్యాలైన రోడ్ల సదుపాయం, విద్య, వైద్యం,ఉపాధి అవకాశాలు ఈ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. గిరిజనులకు ప్రత్యేకంగా ఒక కమిషన్ గిరిజన యూనివర్సిటీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పూర్తిస్థాయిలో వినియోగం, ప్రతి యూనివర్సిటీలోనూ ఇతర సంస్థల పాలక మండలి లో ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తాం అని చెప్పిన ఏ ఒక్కటి చేయకుండానే తన పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఏ మొహం పెట్టుకొని గిరిజనుల ఓట్లు కావాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడని శంకర్ నాయక్ దుయ్యబట్టాడు.
ఇదే సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తాను చెప్పిన హామీలు 99 శాతం అమలు చేశారని , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట చెప్పాడు అంటే అది కచ్చితంగా చేస్తాడని నమ్మకాన్ని ప్రజల్లో పొందారని తెలిపారు. అంబేద్కర్ పూలే వంటి మహనీయుల స్ఫూర్తితో పేదలు బతుకుల్లో వెలుగులు నింపేలా పాలన సాగిస్తున్న సీఎం జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి జనం సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.