‘జనసేన ద్వారా డబ్బు సంపాదనే పవన్ కళ్యాణ్ లక్ష్యం. సినీ గ్లామర్ను పెట్టుబడిగా పెట్టి అభిమానుల నుంచి అందినంత దోచుకోవడమే ఆయనకు తెలుసు’ పొలిటికల్ సర్కిల్లో ఉండే అభిప్రాయం ఇది. అందుకు తగినట్లుగానే ఆ పార్టీ వ్యవహారాలుంటాయి. కనీసం కార్యాలయాలను కూడా నిర్వహించలేని దుస్థితికి సేనను పవన్ తెచ్చారంటే ఆయన ఏ పాటి శ్రద్ధ పెట్టారో అర్థం చేసుకోవచ్చు.
పవన్కు ప్రజలతో పనిలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి ప్రయోజనాలే ముఖ్యం. ఆయన్ను సీఎం చేస్తే చాలు. అడిగినంత ధనం ఇస్తారు. దీనిపైనే ధ్యాస ఉంటుంది తప్ప పార్టీని బలోపేతం చేయాలని ఏనాడూ ఆలోచించలేదు. 2014లో సేనను స్థాపించి గాలికొదిలేశారు. చాలామంది అభిమానులు ఓన్ చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టి కార్యాలయాలు తెరిచి నడిపిస్తున్నారు. కానీ సినిమాల ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదిస్తుంటానని పవనే చెబుతుంటారు. ఇక మెగా ఫ్యామిలీల కంట్రిబ్యూషన్ కూడా అడపాదడపా ఉంది. మూవీస్ రీ రిలీజ్లు, విరాళాల ద్వారా కావాల్సినంత డబ్బు వస్తోంది. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ సరేసరి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఆఫీసులు కూడా నిర్వహించకుండా మీ చావు మీరు చావండని నేతలపై వదిలేశారు. వాళ్లేమో అధిష్టానానికే పట్టకపోతే మాకేమి సంబంధమని ఊరుకున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా మాధవదారలో సేన ఉత్తరాంధ్ర రీజినల్ పార్టీ కార్యాలయం ఉంది. కొన్ని రోజులుగా ఇక్కడ కార్యక్రమాలను నిలిపివేశారు. ఆఫీసుకు టులెట్ బోర్డు కూడా పడింది. దీంతో కార్యాలయం మూసివేతపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా నిర్వహించలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సేనాని అన్న నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని భావించి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. కానీ సీటు రాదని తేలిపోవడంతో దానిని మూసేని హైదరాబాద్కు వెళ్లిపోయారు. రీజినల్ కార్యాలయం విషయంలోనే ఇలా ఉంటే ఇక నియోజకవర్గాల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో.. సేనాని టికెట్ ఆశ చూపి ఇన్నాళ్లు నేతల చేత ఖర్చు పెట్టించారు. టీడీపీ కేవలం 21 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు ఇవ్వడంతో చాలామంది మోసపోయామని భావించి చేతులేత్తేశారు. పవన్ దగ్గర ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు కదా.. కార్యాలయాలు మూతపడితే ఏమవుద్దిలే అని వదిలేశారు. పోనీ ఉన్న విరాళాలతో అయినా నడిపించాలి కదా అంటే.. అవి ఎవరి జేబులోకి వెళ్తున్నాయో..