ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గానికి చాలా బలం ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి దేశ రాష్ట్ర రాజకీయాల్లో కాపు నేతలు క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపుల తరుపున ఆ కుల నాయకులు పోరాడుతూ వచ్చారు. దివంగత వంగవీటి మోహన రంగా తరువాత ఆ స్థాయిలో రాజకీయాల్లో కాపులను కాపు కాసే నాయకుడు కనిపించలేదు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీతో చిరంజీవి వచ్చి ఎంతోకొంత కాపుల తరపున బలంగా నిలబడే ప్రయత్నం చేసినప్పటికీ ఆ బలం ఎన్నో రోజులు నిలబడలేకపోయింది. తరువాత ప్రభుత్వాలను ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ మొదటిలో అర్ధం లేని హడావిడి చేసినా తరువాత చంద్రబాబును నెత్తిన పెట్టుకునేందుకే పార్టీ పెట్టినట్టు ప్రవర్తిస్తూ వచ్చాడు.
ఇలాంటి వింత వైఖరి ప్రదర్శించే పవన్ ను సీఎం చేయాలని జనసేన లో చేరిన కాపు మేధావులు /ప్రముఖులు సిబిఐ మాజీ JD లక్ష్మి నారాయణ, మాజీ IAS తోట చంద్రశేఖర్ , తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ, IAS రామ్మోహన్ రావు , మాజీ IRS అధికారి చింతల పార్ధసారధి ,మాజీ RTI కమీషనర్ విజయ్ బాబు, అద్దేపల్లి శ్రీధర్, మాకం రాఘవయ్య, మాదాసు గంగాధరం.. బీజేపీ MLA ఆకుల సత్యనారాయణ తదితరులు ఇలా చాలామంది నాయకులు జనసేన పార్టీని వీడుతూ వచ్చారు. ఖచ్చితమైన రాజకీయ వైఖరి లేని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉండలేక బయటకు వచ్చేసారు. జనసేన అనే పార్టీ పెట్టినా టీడీపీ భజన చేస్తూ.. చంద్రబాబు, లోకేష్ ఎక్కిన పల్లకికి జీవితకాలపు కూలీలా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చక.. అది జనసేన కాదు బాబు భజన సేన అని బాబు పల్లకి మోయడాన్ని భరించలేక వెళ్లిపోయారు. ఇటీవల కూడా ఒక స్థాయి నాయకులూ కార్యకర్తలు (పసుపులేటి పద్మావతి, ఆమె తనయుడు సందీప్ రాయల్, ఆకుల వెంకటస్వామి, ఆయన కుమార్తె జయకల్యాణి) జనసేనను వీడారు.
జనసేన పార్టీ పెట్టినప్పుడు చివరికి బలమైన కాపు నాయకత్వం చూడబోతున్నామని ఆశపడ్డ కాపులకు పవన్ కళ్యాణ్ మొండి చేయి చూపించారు. టీడీపీ నుండి ప్యాకేజీ తీసుకోని తన సొంత భవిష్యత్తు చూసుకుంటున్న పవన్ కళ్యాణ్ కు కాపుల భవిషత్తు అవసరం లేదు.. వారి ఆశతో పనిలేదు. కాపుల ఓట్లు కావాలి కానీ కనీసం ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వం అన్నట్టుగా లోకేష్ టీవీ ల ముందు కరాకండీగా చెప్పినా పవన్ కళ్యాణ్ టీడీపీ నే సపోర్ట్ చేస్తూ రావడం.. పవన్ కళ్యాణ్ ను పూర్తి స్థాయి నాయకుడిగా చూడాలనుకున్న కాపు యువత ఆశ చిరకాలపు స్వప్నంగానే మిగిలిపోనుందన్న వాస్తవం అర్ధం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు టీడీపీని సపోర్ట్ చేసే విధంగానే రాజకీయాలు చేస్తున్న జనసేన భవిషత్తులో కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాదు. అదే వాస్తవం.. ఆ ఒప్పందం మీద మాత్రమే టీడీపీ చంద్రబాబు.. పవన్ కు ప్యాకేజీ ఇస్తున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ సీఎం కానప్పుడు టీడీపీ కి ఎందుకు ఓటు వేయాలన్నది కాపు సామాజిక వర్గం ప్రజలు ఆలోచించాలి. టీడీపీ బాగా బలహీనపడితే గానీ జనసేన పుంజుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.. అలా ఏ విధానంగా చూసినా టీడీపీ ఓటమే జనసేన భవిష్యత్తుకు దారి.. దాన్ని దృష్టిలో ఉంచుకోని కాపు యువత 2024 ఎన్నికలలో ఆచితూచి అడుగులు వెయ్యడం మంచిది.
కాపులకు వైఎస్సార్ గారి హయాంలో జరిగిన మంచిని గుర్తుచేసుకోవాలి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాపుల తరుపున నిలబడిన విధానాన్ని పరిగణలోనికి తీసుకోని మెరుగైన నాయకత్వాన్ని ఎంచుకుంటే బాగుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే మిన్నగా కాపుల సంక్షేమానికి అన్ని విధాలా కాపు కాశారు. కాపు కుటుంబాల్లోని అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబన కోసం కాపు నేస్తంతో పేదలైన కాపు అక్కచెల్లెమ్మలను ఆర్ధికంగా ఆదుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్లో కాపులను పక్కన కూర్చోబెట్టుకున్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ కాపులకు స్థానం కల్పించారు.
కాపు నాయకుడిగా జనసేనాని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కాపులకు చెయ్యాల్సిన మంచి అంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్నారు.