పార్టీ పెట్టి పదేళ్లు అవుతుంది, ఇంతవరకు కనీసం పార్టీ సంస్థాగత నిర్మాణం కూడా జరగలేదు సరికదా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికే అభ్యర్థులు లేరు. అలాంటి ఓ అనామక పార్టీ కి అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ తన నియంతృత్వ ధోరణిని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నాడు.. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ కల్యాణ్ ని నమ్ముకుని నిజంగానే అందరినీ ప్రశ్నిస్తాడేమో అని బ్రమ పడ్డ పవన్ ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉన్నాడు. ప్రశ్నించడం అంటే జగన్ ని మాత్రమే ప్రశ్నించడమని, అది జగన్ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, చంద్రబాబుని మాత్రం ప్రశ్నించలేడు అనే విషయం ఇప్పుడిప్పుడే ఫాన్స్ అందరికీ అవగతం అవుతున్న తరుణం లో, ఎప్పుడు వైసీపీ వారినీ, వైసీపీ ఎమ్మెల్యే, మంత్రులనే విమర్శించే కళ్యాణ్, ఇప్పుడు చివరాఖరికి తన సొంత ఫాన్స్ నే తిట్టడం మొదలు పెట్టాడు, తనని ప్రశ్నిస్తే ఊరుకునేది లేదని, తనని ఎవరైనా ప్రశ్నిస్తే వారు నావారు కాదని, తనని ప్రశ్నించే వారు పార్టీ వీడాలని ప్రత్యక్ష బెదిరింపులకు దిగాడు. ఇక నిన్న ఇంకో మెట్టు దిగజారి నాదెండ్లని విమర్శించినా ఊరుకునేది లేదని గట్టిగా అరుస్తూ చెప్తున్నాడు. 24 సీట్లు మాత్రమే జనసేనకి కేటాయించడానికి ప్రధాన కారణం నాదెండ్ల మనోహరే కారణం అని పవన్ ఫాన్స్ భావించి అతనిని విమర్శించడం, మొన్న తాడేపల్లి గూడెం లో ఆందోళకు దిగి నాదెండ్లకు నిరసన తెలపడం చూసి పవన్ కల్యాణ్ మరింత రెచ్చిపోయాడు… నాదెండ్ల మీద విమర్శ చేసినా తట్టుకునే స్థితిలో కళ్యాణ్ లేనట్టుగా ఉంది…
అసలు ప్రజాస్వామ్యం లో ఏ రాజకీయ పార్టీ కి అయినా ప్రశ్నించే హక్కు ఉంటుంది, దానికోసమే తను పార్టీ పెట్టానని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, ప్రజాస్వామ్య మూల సిద్దాంతమే అది. కానీ ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన పవన్ తనని ఎవరు ప్రశ్నించినా ఓర్చుకులేడు, తను చేసే ఏ తప్పును ఎత్తి చూపినా అది తనమీద వ్యక్తిగత దాడి అంటాడు. తన అన్నని అవమానించారు అందుకే నాకు కోపం అంటాడు, సొంత అజెండా తో పార్టీ ని నడుపుతూ అదేదో దేశ సేవ అన్నట్లు గా తనని తాను ఎక్కువగా ఊహించుకుని ఈ దేశంలో తనను విమర్శించే స్థాయి లేదనుకుని, చివరికి ఫాన్స్ అవేదనని కూడా భరించలేని స్థితికి దిగజారిపోయాడు. ప్రజాస్వామ్యంలో పవన్ ఒక నూతన అధ్యాయాన్ని రాస్తున్నాడు, మంచికి అయితే ఖచ్చితంగా కాదు. విమర్శని తీసుకోలేని వాడు, విమర్శ చేసేవారు తనతో ఉండొద్దు అనే వారు ప్రజాస్వామ్య వాదులు ఎలా అవుతారు ఫాసిస్టు అవుతాడు కానీ.
ఇలాగే హిట్లర్ జర్మనీ లో నాజీలను రెచ్చగొట్టి, ఉన్మాదులుగా తయారు చేసి, దేశాన్ని మారుద్దాం, వాళ్లని తరిమికొడదాం, వీళ్ల తోలు తీద్దాం అని యూదుల మీద తనకున్న విపరీతమైన ద్వేషం అనే వ్యక్తిగత ఎజెండా అని ఉపయోగించి దేశానికి అధినేత కాగలిగాడు, యూదులని ఊచకోత కోసి తన పగ తీర్చుకోగలైగాడు. పవన్ కూడా అచ్చం అలాగే తన వెర్రి సినిమాల వెర్రి అభిమానులను ఉపయోగించుకుని, వాళ్లని జన సైనికులు అని, వీర మహిళలు అనీ, వారికి ఉన్మాదపు నామకరణం చేసి, తోలు తీస్తా, తాట తీస్తా, ఉరికిచ్చి కొడతా అంటూ బహిరంగ సభల్లో వీధి రౌడీ ల మాట్లాడుతూ ఉన్మాదులను తయారు చేశాడు…
సైన్యం అనేది దేశ సార్వభౌమాధికారం కాపాడటానికి రాజ్యాధీనం లో ఉండే ఒక ఉన్నత వ్యవస్థ, అలాంటిది ఒక ప్రైవేటు వ్యక్తి సైన్యం అనేపేరు పెట్టుకుంటే అది సైన్యం కాదు ఉగ్రవాదం అవుతుంది..
రాను రాను అందులో కొంతమంది తేరుకుని ఇదేమిటి, మన పార్టీ ఉంది టీడీపీ కి ఊడిగం చేయడానికా? మనకి ఎజెండా లేదా? నువ్వు కదా సీఎం అవ్వాలని తమ ఆవేదన వెల్లడించేసరికి ఇప్పుడు వాళ్లని కూడా నానామాటలు అనడానికి కూడా ఆలోచించడం లేదు.. హిట్లర్ కి పనిచేసిన ఫాసిస్టు సిద్దాంతం తనకి పనిచేయడం లేదని బాధలో ఉన్నట్లుగా ఉంది పవన్ వ్యవహారశైలి..
ఓటమిని హుందాగా ఒప్పుకోలేని వాడు, తన ఓటమికి ” మీరే కారణం, మీరు నన్ను గెలిపించలేదు, ఏ మొహం పెట్టుకుని సీట్లు ఎక్కువ అడగమంటారు” అంటూ తన చేతగాని తనాన్ని ఇతరుల మీదకి రుద్దేవాడు, ప్రశ్నించే పార్టీ అని- ప్రశ్నని ఓర్వలేని వాడు, ఎప్పుడు ఒకరి మీద ద్వేషం తో మంచికీ చెడుకు తేడా తెలియకుండా ఇష్టారీతిన ప్రవర్తించేవాడు, అసలు రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు? నాయకుడు కాదు కదా అసలు సామాన్య మానవుడు ఎలా అవుతాడు? మానసిక వికలాంగుడు అవుతాడు కానీ?….
పవన్ కల్యాణ్ రాజకీయ జీవితం మొదలు పెట్టినప్పుడు తన ఫాన్స్ లో ఉన్న గౌరవాన్ని ఈనాడు తన చేష్టలతో అసహ్యంగా తనే మార్చుకున్నాడు… ఇంతకన్నా దిగజారడెమోలే అనుకున్న ప్రతీసారి అంతకన్నా నీచంగానే దిగజారి ప్రవర్తిస్తుంటాడు…