పచ్చమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం రాజకీయంగా ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పోటీ చేసిన నియొజకవర్గం కావడంతో ఈ నియోజకవర్గం పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక దృష్టి ఉంటుంది. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ దారుణంగా ఓటమి చెందారు. శాసన సభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెడతానని ఎంతో ఆశ పడ్డ ఆయనకి భీమవరం ప్రజలు గట్టి షాకే ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ భీమవరంలో ఓటమి చెందిన రోజు నుంచే ఆ నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. తాను ఎంతో ఆశలు పెట్టుకున్న నియోజకవర్గం ప్రజలు తాను ఆశించిన ఫలితం ఇవ్వకపోయేసరికి స్థానిక ప్రజలపై అలకపూనినట్టు వ్యవహరిచారు పవన్ కళ్యాణ్ . అయితే జనసేన నాయకులు మాత్రం అడపదడపా పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో కూడా భీమవరం నుండే పోటీచేస్తారని చెప్పుకుంటు వస్తున్నా పవన్ నుండి స్పష్టమైన సంకేతాలు వచ్చిన దాఖలాలు లేవు.
అయితే ఇప్పుడు భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజ నేయులు(అంజిబాబు) జనసేన పార్టీలో చేరబోతునట్టు వార్తలు వస్తున్నాయి. అంజిబాబు హైదరాబాద్ వెళ్లి పవన్ కళ్యాన్ని కలిసినట్టు తెలుస్తుంది. ఆయన తనకి జనసేన తరుపున భీమవరం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరినట్టు. పవన్ కళ్యాణ్ సైతం ఆయన కోరికకు సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. తాడేపల్లిగూడెంలో 28న జరిగే జనసేన,తెదేపా బహి రంగ సభలో జనసేనలో ఆయన చేరనున్నట్లు తెలుస్తుంది. జరిగుతున్న పరిణామాలు చూస్తుంటే ఓటమి చెందిన స్థానంలో మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకోవడం రిస్క్ గా భావించిన పవన్ కళ్యాణ్ భీమవరం నుండి వెళ్ళిపోతున్నాడని పరిస్థితులు చూస్తే అర్ధమవుతున్నాయి.