పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు జనసేన సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. నేను రాజకీయ పార్టీ పెట్టింది సుగాలి ప్రీతి తల్లి లాంటి వాళ్ల కోసమని, మీకోసం కాదని తన కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఆ మాట అనడానికి అయితే బాగుంది కానీ ఆచరణలో మాత్రం భిన్నంగా చేస్తున్నాడు పవన్ .
సుగాలి ప్రీతి కేసు విషయానికొస్తే ప్రీతి కర్నూలు జిల్లాలోని కట్టమంచి రామలింగారెడ్డి హై స్కూల్లో పదో తరగతి చదువుతున్న సమయంలో 2017 ఆగష్టు 19న హైస్కూల్లోనే అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయాన్ని కట్టమంచి రామలింగారెడ్డి హై స్కూల్ వాళ్ళు ప్రీతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మొదట చనిపోయింది అని చెప్పకుండా మీ పాప పడిపోయింది మీరు త్వరగా రావాలని ఫోన్ చేసి చెప్పారు. ప్రీతి తల్లితండ్రులు హుటాహుటిన రామలింగారెడ్డి హై స్కూల్ హాస్టల్ కి వెళ్ళగా ప్రీతి హాస్టల్ రూమ్ లో ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించింది. ప్రీతి తండ్రి రాజు నాయక్ తమ పాప ఇంకా బ్రతికే ఉంది అంటూ ఉరికి వేలాడుతున్న పాపని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సుగాలి ప్రీతి మృతి పై తల్లితండ్రులు అనుమానం వ్యక్తపరచగా కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో ప్రీతి పై అత్యాచారం చేసి హత్య చేశారని రిపోర్టులో వెల్లడైంది. అప్పటి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాండ్ర శివానందరెడ్డి, చంద్రబాబుల సహకారంతో ఈ కేసుని వీగిపోయేలా చేశారు. ఈ కేసును నీరుగార్చేందుకు పోస్టుమార్టం చేసిన మొదటి డాక్టర్ రిపోర్ట్ తప్పని, మరో ఇద్దరు డాక్టర్లు ద్వారా పోస్టుమార్టం రిపోర్టులో మార్పులు చేశారు. అసలు ప్రీతిపై ఎటువంటి అత్యాచారం జరగలేదు అనే రిపోర్ట్ నీ తీసుకొని వచ్చారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ కూడా ప్రీతి పై హత్యాచారం జరిగినట్లు నివేదిక ఇచ్చింది. దీంతో పోలీస్ శాఖ ఆ స్కూల్ యజమాని అతని కుమారుడిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు, ప్రస్తుతం వారు బెయిల్ పైన ఉన్నారు. ఈ కేసులో టీడీపీ నేత వి.జనార్థన్ రెడ్డి కుమారులే నిందితులు, నిందితులకి షల్టర్ ఇచ్చించి కూడా టీడీపీ నాయకుడు మాండ్ర శివానంద రెడ్డే అని ప్రీతీ తల్లితండ్రులు ఆరోపించారు.
ఇదిలా ఉంటే తెలుగుదేశం పాలనలో జరిగిన ఈ దారుణాన్ని నాడు అదే తెలుగుదేశంతో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ 2017 నుండీ 2019 వరకు కూడా ఎక్కడా మాట్లాడలేదు. 2019 ఎన్నికల అనంతరం జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వంపై నెపం వేసేలా ప్రీతీ ఘటనని వాడుకున్నారు. బాధితులకు న్యాయం జరగాలని, హంతకులుకి శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ర్యాలీ చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది. అప్పటికే జగన్ గారు అధికారంలోకి రాగానే ఆ కేసు విచారణ వేగవంతం చేశారు. తర్వాత కొన్ని రోజులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కర్నూల్ పర్యటనకు వెళ్లగా సుగాలి ప్రీతి తల్లితండ్రులు సీఎంనీ కలిశారు. సిఎం జగన్ ను కలిసి తమ బాధను చెప్పుకుని కేసుని సీబీఐ కి అప్పగించమని కోరగా, సుగాలి ప్రీతి తల్లి తండ్రులు అడిగినట్లు కేసును సిబిఐకి అప్పగిస్తూ కోరిన 10 రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేశారు, అదే సమయంలో ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకుని సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు కర్నూల్ లో అయిదు సెంట్ల ఇంటి స్థలం, 8 లక్షల నగదు, ఐదు ఎకరాల పొలం, ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం అని ప్రకటించి.. అన్ని ఇచ్చింది.
ఇప్పుడు అసలు విషయంకొస్తే సుగాలి ప్రీతి సంఘటన జరిగింది 2017 లో, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు. అప్పట్లో ఈ కేసును నీరుగార్చేలా చేసింది టిడిపి నేత మాండ్ర శివానందరెడ్డి. ఆ సంఘటన జరిగింది చంద్రబాబు హాయంలో అయినా వారిని ప్రశ్నించడు, కానీ పవన్ కళ్యాణ్ ఆ కేసును నీరుగార్చిన టిడిపి తోనే పొత్తు పెట్టుకుంటాడు. ఆరోపణాలు ఎదుర్కుంటున్న టీడీపీ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి కోసం భవిష్యత్తులో ప్రచారం చేసిన చేస్తాడు. పైకి సుగాలి ప్రీతి తల్లిదండ్రుల కోసం రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకునే పవన్ కళ్యాణ్, సుగాలి ప్రీతీ హత్యని తన రాజకీయ ఎదుగుదలకి, ప్రచారానికి వాడుకున్నాడే తప్ప చిత్తశుద్దితో లేడని ఈ ఘటనతో తేలిపోయింది. తను చేసే పనులకి చెప్పే మాటలకి పొంతనే ఉండదని మరో సారి పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నాడు.