‘జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన మహేష్కు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సీట్ కేటాయించాలని సంతకాల సేకరణ కార్యక్రమం ప్రెజర్ పేట ఎర్రకట్ట వద్ద జరిగింది. ఇందులో ప్రజల స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేయడం జరిగింది.’
‘మహేష్కు గుర్తింపు లేదంటే రాజధానిలో జనసైనికులకు గుర్తింపు లేనట్లు. ఈరోజు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో పోతిన మహేష్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం జరిగింది.’
‘మహేష్ ఏంటి నీకు బాధ లేదా అంటే వెళ్లి ఆ క్రీస్తు శిలువకు చెప్పుకున్నాను నా బాధ. పోరాడాను. నా ప్రయత్నం నేను చేశాను.’ ఇవీ సోషల్ మీడియాలో మహేష్ పోస్టులు. ఆయనకు టికెట్ ఇవ్వాలంటూ హ్యాష్ట్యాగ్లతో ట్రెండింగ్ చేస్తున్నారు. కానీ ప్రయోజనం శూన్యం. దానికి కారణం పవనే..
విజయవాడ పశ్చిమ టికెట్ కోసం పోతిన మహేష్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పవన్ కళ్యాణ్ దానిని భారీ రేటుకు అమ్మేశారని ప్రచారం ఉంది. అది కూడా ఎవరికో కాదు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి బాగా కావాల్సిన మనిషి సుజనా చౌదరికి. వాస్తవానికి ఈ సీటు కోసం బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్ తదితరులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ చివరికి జనసేనకు వెళ్లింది. దీంతో మహేష్ తనకే ఇస్తారని భావించారు. అయితే పవన్ త్యాగాల పేరుతో బీజేపీ కోసం సీటును వదులుకుంటున్నట్లు ప్రకటించారు.
వాస్తవం ఏంటంటే.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి. టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉండగా ఆయన ఆదేశాలతో బీజేపీలోకి వెళ్లారు. తెలుగుదేశంతో కమలం పార్టీ పొత్తు పెట్టుకునేలా లాబీయింగ్ చేసిన వారిలో ఒకరు. ఈయన కోసం నారా వారు అడగ్గానే పవన్ తన పార్టీ నేతను బలి చేశారు. మహేష్ ఇప్పటికీ తనకే టికెట్ వస్తుందని ఆశలతో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఆ అవకాశమే లేదు. సీటు వదులుకున్నందుకు బాబు సుజనా ద్వారా సేనానికి భారీ ప్యాకేజీ ఇచ్చినట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
ఓ వైపు మహేష్ సంతకాల సేకరణంటూ కార్యక్రమాలు చేస్తుంటే.. బుధవారం సుజనా తాపీగా పిఠాపురంలో పవన్ను కలిసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం మీడియాతో నేను పోటీ చేస్తున్న విజయవాడ పశ్చిమలో సమస్యల గురించి పవన్తో చర్చించడం జరిగింది. పోతిన మహేష్తో మాట్లాడి ఏ సమస్య లేకుండా చూస్తానని జనసేనాని అన్నారు. అంతేగాక ప్రచారం కూడా చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఇది బాబు సన్నిహితులపై పవన్ చూపించే ప్రేమ. అదే సొంత పార్టీ నాయకుల వద్దకు వచ్చే సరేకి పోతే పోయారులే అనే ధోరణిలో ఉంటారు. కానీ జనసైనికులు మాత్రం ఈ విషయాలు తెలుసుకోకుండా పవన్ను గొప్ప వ్యక్తిగా చూస్తుంటారు. వారు అమాయకంగా ఉండబట్టే సేనాని ఆటలు సాగుతున్నాయి.