సోషల్ మీడియాలో జనసైనికులను తెలుగు తమ్ముళ్లు గొర్రెలు అని ముద్దుగా పిలుస్తుంటారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్లుగా వారు తమ నాయుడిని గుడ్డిగా నమ్మేస్తుంటారు. ముందు వెనుకా ఆలోచించరు. కొన్ని సందర్భాల్లో వచ్చే వార్తల్లో నిజం ఉందా? లేదా? అని తెలుసుకోకుండా నమ్మి.. ఆఖరికి ఫూల్స్ అవుతుంటారు. ఇది వారికి నిత్యకృత్యమైంది. మంగళవారం నుంచి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఓ యూట్యూబ్ ఛానల్ వార్త చక్కర్లు కొడుతోంది. ఎన్నికల కోసం పవన్ హైదరాబాద్లో ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నాడంట. గత వారం ఒక ఖరీదైన భూమి అమ్మాడు. మరో రెండు, మూడు స్థలాలు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఆస్తుల అమ్మకం వార్తను సేన పెద్ద తలకాయలే ప్రచారం చేస్తూ.. ఇదీ సేనాని నిజాయతీ అని సింపతీ డ్రామా కోసం ప్రయత్నిస్తున్నాయి. అసలు పవన్ చేతిలో ప్రస్తుతం అరడజనకు పైగా సినిమాలున్నాయి. ఆయన గతంలో చెప్పింది ఒక్కో మూవీకి సుమారు రూ.50 కోట్లు తీసుకుంటానని.. అప్పట్లో సంపాదించింది.. ఇప్పుడు లెక్కలు తీసుకున్నా ఆస్తి వందల కోట్ల రూపాయల్లో ఉంటుంది. మొన్నే పార్టీ ఎన్నికల ఖర్చులకంటూ రూ.10 కోట్ల విరాళం ప్రకటించాడు.
అసలు జనసేనకు ఇం‘ధనం’ పోస్తోంది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఇక ఆస్తులు అమ్మాల్సిన అవసరం ఏముందని సాక్షాత్తు తెలుగు తమ్ముళ్లే ప్రశ్నిస్తున్నారు. కేవలం 24 టికెట్లు తీసుకోవడంతో జనసైనికులు అధినేత తీరుపై రగిలిపోతున్నారు. దీంతో వారిని మరో విషయంపైకి మళ్లించేందుకు ఆస్తుల అమ్మకం అంటూ ఫేక్ న్యూస్ను పైకి తెచ్చారు. ఐటీడీపీ జీతగాళ్లు, సేన సీనియర్ నేతలు, శతఘ్ని టీమ్, న్యూట్రల్ ముసుగులో ఉన్న సోషల్ మీడియా పేజీలు దీనిని హైలెట్ చేస్తున్నాయి. దీంతో అభిమానులు సీట్ల విషయం మరిచిపోతారు. ఇంకా వారి నుంచి ఎన్నికల పేరుతో విరాళాలు భారీగా వసూలు చేయొచ్చు. దీని వెనుక ఇంత కుట్ర ఉంది.
సింపతీ డ్రామాలు సేనానికి కొత్త కాదు. పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నానని, స్టాఫ్కు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, కార్ల ఈఎంఐలకు తన వద్ద డబ్బు లేదని గతంలో పలుమార్లు అభిమానులకు చెప్పాడు. వారు గొర్రెల్లా నమ్మేసి విరాళాలు సమర్పించుకున్నారు. కానీ సేనాని స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ చంద్రబాబు ప్యాకేజీతో జల్సాగా జీవిస్తున్నాడని ప్రచారం ఉంది. ఇల్లు అమ్మలేదని, అదంతా ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. దీంతో జనసైనికులే మండిపోతున్నారు. ఎన్నికలు సమీపించే కొద్దీ పవన్ కళ్యాణ్ ఇంకెన్ని వేషాలు వేస్తాడో..