జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ నేను రాజకీయల్లో విలువలు సిద్దాంతాలు పాటించడానికి వచ్చానని నా పార్టీలో అన్ని పార్టీల మాదిరి జంపర్స్ , జోకర్స్ ని ప్రోత్సహించనని , కార్యకర్తల నుండే నాయకులని తయారు చేసుకుంటానని ఆకర్షణియంగా డైలాగులు చెప్పారు. అయితే ఆ విలువలు సిద్దాంతాలు ఆయన ఎప్పుడైనా పాటించారా అంటే కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడంలేదు. దీనికి తాజా సాక్ష్యం అనకాపల్లి జనసేన సీటు ప్రకటన.
జనసేన పార్టీని నమ్ముకుని పరుచూరి భాస్కరరావు ఆరేళ్ల నుంచి అనకాపల్లి సీటును ఆశిస్తూ అక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ఈ సీటు పరుచూరి భాస్కరరావుదే అన్నట్టుగా ప్రోత్సహించి ఆయన చేత సమయం డబ్బు ఖర్చుపెట్టించారు. తీరా ఎన్నికలు వచ్చేసరికి ఆరేళ్ల నుంచి ఉన్న పరుచూరి భాస్కరరావుకి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా సీనియర్ కాంగ్రెస్ నేత అయిన కొణతాల రామ కృష్ణను పార్టీలో చేర్చుకున్న కేవలం నెల రోజుల వ్యవదిలోనే టిక్కెట్ ప్రకటించి పరుచూరి భాస్కరరావును నిండా ముంచేశాడు పవన్ కళ్యాణ్.. ఈ విషయమే భాస్కరరావు కార్యకర్తల సమావేశంలో చెప్పి బోరున విలపించడం అక్కడ అందరిని ఆవేదన కలిగించింది..
జంపర్స్ జోకర్స్ ని పార్టీలో చేర్చుకోను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీలో ఉన్న పరుచూరి భాస్కరరావును కాదని అదే పార్టీ మారి వచ్చిన కొణతాల రామ కృష్ణకు ఎలా సీటు ఇస్తారని అక్కడ జనసేన కార్యకర్తలే పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించడం గమనార్హం. ఇది పవన్ కళ్యాణ్ చేసిన మోసమే అంటూ పలువురు జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.