రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపుటములు పక్కన పెడితే బాబుకి మాత్రం జీవిత కాల విశ్వాస పాత్రుడుని మాత్రం సంపాదించుకోగలిగాడు . నిప్పుల్లో దూకమంటే దూకే బానిస, శత్రువుగా నటించమంటే నటించే బానిస, రాయబారం చేయమంటే కాళ్ళ బేరం చేసే బానిస ఎంత ధనం పోసినా ఎవరికి దొరుకుతారు చెప్పండి . అదృష్టం కొద్దీ దొరకాల్సిందే . అలాంటి బానిసని సొంతం చేసుకొన్న బాబు మహా అదృష్టవంతుడు అని చెప్పొచ్చు ఇంతకీ ఎవరా బానిస అంటారా. ఈపాటికి అర్ధం అయిపోయి ఉంటుంది మీకు పవన్ కళ్యాణ్ అని.
పవన్ బానిసత్వాన్ని చూస్తే బాహుబలిలో కట్టప్ప సిగ్గు పడతాడు, మాలిక్ కాఫీర్ చిన్నబోతాడు, బహుశా ప్రపంచ చరిత్రలో పవన్ ని మించిన బానిస ఉండకపోవచ్చు ఏమో.
పార్టీ పెట్టిందే బాబు కోసం అన్నట్టు 2014 లో పార్టీ పెట్టి పోటీ చేయకుండా మద్దతు ఇచ్చాడు. 2019 లో శత్రువులా నటించు చెప్పిన వాళ్లకి సీట్లివ్వు అనగానే జి హుజూర్ అనటమే కాకుండా బి ఫారాలు కూడా మీకు ఇష్టం వచ్చిన వాళ్లకి ఇచ్చుకోమని ఖాళీ ఫారాల మీద సంతకం చేసిచ్చాడు.
ఇహ 2024 ఎన్నికల్లో జగన్ ని ఒంటరిగా ఎదుర్కోవటం సాధ్యం కాదని ముందే అర్ధం చేసుకొన్న చంద్రబాబు 2020 నుండే బిజెపికి స్నేహ హస్తం చాచినా వాళ్ళు ఛీ కొట్టడంతో తన పార్టీ రాజ్యసభ పక్షాన్ని బిజెపిలో విలీనం చేశాడు. అయినా బిజెపిలో కదిలిక లేకపోయే సరికి తన విశ్వాస పాత్రుడు పవన్ ని బిజెపితో పొత్తులో కలిపాడు. నాటి నుండి టీడీపిని కనికరించమని బిజెపిని పోరుతూనే ఉన్నాడు పవన్ . ఇటీవలి కాలంలో బిజెపి వాళ్ళు తిట్టారని కూడా వాపోయాడు పాపం .
చివరికి ఎన్నికల వేళ సమీపిస్తున్నా బిజెపి మౌనమే సమాధానం అన్నట్టు వర్తించడంతో టీడీపీకి 94, జనసేనకి 24 సీట్లు ప్రకటించుకొని మిగతావి బిజెపి పొత్తు కోసం అట్టిపెట్టి మళ్ళీ ఢిల్లీ పోయి గత మూడు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. అయితే సీట్ల విషయంలో బిజెపి చెప్పినట్లు ఈ రెండు పార్టీలు వినే పరిస్థితి రావటంతో టీడీపీకి కొరత రాకుండా జనసేనకు కేటాయించిన మూడు ఎంపీ స్థానాల్లో ఒకటి, 24 ఎమ్మెల్యే స్థానాల్లో ఆరు నుండి ఎనిమిది త్యాగం చేయవలసి వస్తుందట పవన్ .
టీడీపీతో పొత్తులో భాగంగా 40 నుండి 50 అసెంబ్లీ స్థానాలు జనసేనకు ఇస్తేనే పొత్తుకి ఒప్పుకోవాలన్న జనసైనికుల ఆశలు బుగ్గి పాలు చేస్తూ 24 తీసుకొన్న సేనాని ఇప్పుడు వాటిలో కూడా కొన్ని స్థానాలు బిజెపి టీడీపిల కోసం త్యాగం చేయడం చూస్తుంటే బానిసలకే మహా బానిస అని జన సైనికులు కూడా తల దించుకొనే పరిస్థితులు కల్పించాడు పవన్ అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.