ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తరువాత ఆ పార్టీ క్యాడర్ కి అందుభాటులో లేకుండా సైలెంట్ గా సినిమాలు చేసుకున్న పవన్ కళ్యాణ్. రాష్ట్ర విభజన తరువాత నేను ఉన్నాను అంటూ హడావిడిగా జనసేన పార్టీ పెడుతునట్టు ప్రకటించుకున్నారు. ప్రకటించడమే ఆలస్యంగా హైద్రబాద్ లో సభ పెట్టి చేసిన హడావిడి ఇంకా అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఆ సభలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యంగా రాజకీయాల్లో జంపర్స్ ని జోకర్స్ ని తీసుకోబోమని , డబ్బు ప్రభావం లేకుండా రాజకీయాలు చేయడమే తన లక్ష్యమని భారీగానే ప్రకటనలు చేసుకుంటూ వచ్చారు.
2014లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలు పేరు చెప్పి బీజేపీకి చంద్రబాబుకి బహిరంగంగా మద్దతు ప్రకటించి తన పార్టీని మాత్రం ఎన్నికల్లో పోటీ నుంచి దూరంగా ఉంచారు. ఆ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇస్తున్న హామీలకి నాదీ పూచీ అంటూ చంద్రబాబుని ఆయన హామీలని భుజాన మోస్తూ ఊరూరు తిరిగి ప్రచారం చేశారు. తీరా ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా ప్రజలని మోసం చేసిన పక్షంలో , పూచి నాది అన్న పవన్ కళ్యాణ్ – మొహం చాటేసి తిరగడం మొదలుపెట్టాడు. ఇక్కడే పవన్ కళ్యాణ్ పై సామాన్యలు ఏర్పర్చుకున్న సదబిప్రాయం పోయి . చంద్రబాబు జేబులో మనిషే ఈ పవన్ కళ్యాణ్ అనే ఒక నిశ్చయానికి వచ్చారు సామాన్య ప్రజలు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ దారుణ ఓటమి.
2014లో చెప్పినట్టు జంపర్స్ కి జోకర్స్ కి తన పార్టీలో చోటు లేదంటూనే చంద్రబాబు చెప్పిన అభ్యర్ధులకే 2019లో సీట్లు ప్రకటించడంతో జనసేన సిద్దాంతాలు మొత్తం ఒట్టి మాటలే , కేవలం ప్రజలని మభ్యపెట్టే సినిమా డైలాగులు మాత్రమే అని తేలిపోయింది. చంద్రబాబే అనుకుంటే చంద్రబాబుని మించి పవన్ కళ్యాణ్ మాటలు మార్చడం చూసిన ప్రజలు ఏవగింపు కలిగింది. ఇప్పటికి తన వైఖరిని మార్చుకోకపోగా ఇంకో అడుగు ముందుకేసిన పవన్ కళ్యాణ్ భీమవరంలో మాట్లాడుతూ తాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానని ఎక్కడా చెప్పలేదని రాజకీయాలంటే డబ్బు ఖర్చు పెట్టడమేనంటూ జనసేన క్యాడర్ కి షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, భోజనాలకైనా పెట్టుకోపోతే ఎలా? ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టం, ఓట్లు కొనాలా లేదా అన్న నిర్ణయం మీరు తీసుకోండి అంటూ మాట్లాడి ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసేశారు. పూటకో మాట రోజుకో నాటకం ఆడటం పవన్ కళ్యాణ్ అలవాటుగా మార్చుకునట్టు జరిగిన ఘటనలు చూస్తే ఇట్టే అర్ధమవుతున్నాయి.
గతంలో సైతం పవన్ కళ్యాణ్ ఇలా పొంతన లేని మాటలు చాలానే మాట్లాడారు. చింతమనేని నన్ను చంపటానికి ప్లాన్ చేసారు, లోక్సభ ఎన్నికలకు ముందు యుద్ధం జరుగుతుందని రెండేళ్ల క్రితమే బీజేపీ నాకు చెప్పింది, మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే, మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులే, నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేందుకు ప్రత్యేక సుపారీ ఇచ్చారు, ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారు, గర్భీణిల లెక్కలు ప్రభుత్వానికి ఎందుకు చెప్పాలి అంటూ నోటికి అదుపులేకుండా మాట్లాడిన పవన్ కళ్యాణ్ సమాజంలో అలజడికి కారణమయ్యారు. ఇప్పుడు ఓటుకు నోటు రాజకీయాలను బహిరంగంగా ప్రోత్సహిస్తూ ఎన్నికల నియమావలినే దెబ్బతీసేలా మాట్లాడారు. ఇన్నిరోజులు జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తారు మా అధినేత, అందుకే నాగబాబు డోనేషన్ కలక్షన్ అంటూ సొల్లు కబుర్లు చెబుతూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకున్న పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ పేల్చిన ఈ బుడగతో ఇప్పుడు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.