జడ శ్రవణ్ కుమార్ ఎల్లో మీడియాలో సెలెబ్రిటీలా కొంతకాలం ప్రతీ డిబేట్ లో కనిపించే వ్యక్తి. ఏమైందో ఏమో తెలీదు కానీ సడన్ గా చంద్రబాబుకి వ్యతిరేకంగా వీడియో వదిలి ఎల్లో మీడియా నుండి వైదొలిగి చంద్రబాబు చేసిన అన్యాయాలపై మాట్లాడుతూ వచ్చాడు. అసలు చంద్రబాబు భజన చేస్తూ కాలం గడిపిన జడ శ్రవణ్ కుమార్ అకస్మాత్తుగా మాట మార్చడం వెనుక ఉన్న కారణం తన జైభీం భారత్ పార్టీతో తెలుగుదేశం పొత్తుకు నిరాకరించడమే కారణం అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది.
జడ శ్రవణ్ కుమార్ కు ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి చంద్రబాబు రెడీ అయ్యారని, కానీ టీడీపీ తరపున పోటీ చేస్తేనే సీటు ఇస్తామని, జై భీం భారత్ పార్టీతో పొత్తు ఉండదని చంద్రబాబు తేల్చి చెప్పారట.. దాంతో హర్ట్ అయిన శ్రవణ్ కుమార్ చంద్రబాబుకు వ్యతిరేకంగా వీడియోస్ చేస్తూ తన కోపాన్ని చూపించే ప్రయత్నం చేసారని ప్రచారం జరిగింది. మరోవైపు కెఏ పాల్ కూడా తనదైన శైలిలో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ప్రజాశాంతి పార్టీని నడిపిస్తున్నారు. పైగా పవన్ కళ్యాణ్ తన పార్టీలోకి వస్తే సీఎం గా చేసే బాధ్యత తనదని బంపర్ ఆఫర్లు కూడా ఇస్తున్నారు.
వీరిద్దరినీ పక్కనబెడితే పార్టీ పెట్టి పదేళ్లయినా స్థిరత్వం లేక పార్టీని ఎలా నడిపించాలో తెలియక తనను నమ్ముకున్న కేడర్ ను గాలి కొదిలేసి ఇతర పార్టీల పొత్తులకోసం పాకులాడుతున్న ఏకైక నేతగా పవన్ కళ్యాణ్ మిగిలిపోతారేమో. కే.ఏ పాల్, జడ శ్రవణ్ కుమార్ కూడా తాము పోటీ చేసే స్థానాలు తామే నిర్ణయించుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలా కాదు. జనసేన ఎన్నిచోట్ల పోటీ చేయాలన్నది తెలుగుదేశం నిర్ణయిస్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలా లేక ఎంపీగా పోటీ చేయాలా అనేది బీజేపీ నిర్ణయిస్తుంది. రాజకీయ పార్టీని నడుపుతున్న పేరుతో ఇతర పార్టీలకు బానిసత్వం చేయడం తన కేడర్ ను వేరే పార్టీల జెండాలను మోయమనడం పవన్ కళ్యాణ్ కే చెల్లింది.
ఆఖరికి జడ శ్రవణ్ కుమార్ కూడా పొత్తుకు నిరాకరించిన చంద్రబాబుకు ఎదురుతిరిగాడు.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎంపీ సీట్లను ఎమ్మెల్యే సీట్లను చంద్రబాబు గెలుపుకోసం తాకట్టు పెట్టేసాడు.. చంద్రబాబుకు కట్టు బానిసలా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రవర్తన పట్ల జనసేన కేడర్ ఎలా స్పందించాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.. పార్టీ పెట్టిన పదేళ్లలోపు ఆమ్ ఆద్మీ, వైసీపీ లాంటి పార్టీలు అధికారాన్ని హస్తగతం చేసుకుంటే పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీకి ఊడిగం చేస్తూ కాలం గడిపేస్తున్నాడు..తన స్వప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెడుతున్న పవన్ కళ్యాణ్ ఇకనైనా తన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని జనసైనికులు కోరుకుంటున్నారు. కానీ జన సైనికుల ఘోష పవన్ కు పట్టడం లేదు.. వినాలన్న ఆలోచన కూడా పవన్ కు లేదన్నది సుస్పష్టం. పార్టీని పార్టీ కేడర్ ని నిర్లక్ష్యం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇదే పంథాను కొనసాగిస్తే జనసేన పార్టీ మరో వందేళ్ల తర్వాత కూడా వృద్ధిలోకి వస్తుందన్న గ్యారెంటీ లేదు..