ఎలక్షన్స్ అయ్యే వరకు ఏపీ లో వాలంటీర్లతో ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను, వాలంటీర్ల ద్వారా ప్రజలకు ఎలాంటి డబ్బులను పంపిణీ చెయ్యవద్ధని, వారి దగ్గర వున్న ఫోన్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ఎలక్షన్ కమీషన్ ఆదేశించింది.
ఏపీ లో గత నాలుగేళ్లుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నెలలో మొదటిరోజునే వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ప్రభుత్వము ఫించన్ పంపిణీ చేస్తుంది అయితే మాజీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గా పని చేసిన నిమ్మగడ్డ ప్రసాద్ వాలంటీర్ల వ్యవస్థ మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వాలంటీర్లను ఎలక్షన్స్ అయ్యే వరకు ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమలకు వినియోగించుకోకూడదు, ఫించన్ లు కూడా చేతికి ఇవ్వకూడదు, వీరిని ఉపయోగించకూడదు అని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దాని మీద విచారణ జరిపి ఈ ఎలక్షన్స్ అయ్యే వరకు వాలంటీర్లు ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా అలాగే ఫించన్ లు ఇవ్వకుండా అదేశాలు ఇచ్చింది.
దీనితో రాష్ట్రంలోనీ ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి , ఇన్ని రోజులు పొద్దునే కోడి కుయ్యకముందే వాలంటీర్లు తమకు ఫించన్ లు అoదించే వారు ఇప్పుడు టీడీపీ, నిమ్మగడ్డ ప్రసాద్ చేసిన ఫిర్యాదుతో రేపు వారే గ్రామ సచివాలయలకు వెళ్ళి ఫించన్ లు తీసుకోవాలి. అలాగే ఏదైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పనులు కూడా వాలంటీర్లు ఇన్ని రోజులు చేదోడు వాదోడుగా వున్నారు ఇక రేపటి నుండి ప్రజలే తమ పనులకు సంబంధించి ప్రభుత్వ ఆఫీస్ ల చుట్టూ తిరగాలి. ఇది ఎలక్షన్స్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తోందో వేచి చూడాలి.