విశాఖపట్నంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ నిన్న ప్రకటించిన టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనలో సామాజిక న్యాయం శూన్యం అని తెలిపారు. బీసీల పార్టీ తమది అని చెప్పుకునే టీడీపీ పార్టీ బీసీల కోసం ఎన్ని సీట్లు ప్రకటించిందో చూడాలి అన్నారు. 2014 నుంచి 2019 దాకా 50 శాతం ఉన్న బీసీలకు కేవలం ఒకటి రెండు పదవులు ఇచ్చి వంద పదవులు ఇచ్చినట్లు బిల్డుప్ ఇచ్చారు. ఎస్సి రిజర్వడ్ నియోజక వర్గాలలో సీట్లు ఎస్సిలకు ఇవ్వడం గొప్పగా భావిస్తున్నారు అంటూ వర్ల రామయ్యను దుయ్యబట్టాడు.
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అయిదు సంవత్సరాలలో ప్రజలకు ఏమి చేసామో చెప్పి ఓట్లు అడుగుతుంటే, టీడీపీ జనసేన మాత్రం పొత్తే బలమని భావిస్తూ ఎన్నికల బరిలోకి దిగుతున్నారని తెలిపారు . తుప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాసులకు గోల్డ్ కలర్ వేసుకుని తాము బలంగా ఉన్నామన్న భ్రమలో జనసేన, తెలుగుదేశం పార్టీ లు ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ తమ అయిదు సంవత్సరాల అధికారంలో ఫలానా మంచి చేసాం అని చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ . ఎవరు ఎన్ని పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.