జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే, నిన్న పిఠాపురంలో ప్రచారం చేస్తూ పాదయాత్ర అంటూ కొద్దిసేపు హడావుడి చేశారు. యూ కొత్తపల్లి గ్రామంలో మహిళలతో సభ పెట్టారు అక్కడికి వచ్చిన ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ మీటింగ్ కి సంబంధిన అనుమతి పత్రాలను అడగటంతో తెల్లమొఖం వేసుకొని సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇలా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రతి రోజూ ఎలక్షన్ అధికారులకు , పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఇచ్చిన షెడ్యూల్ ను ఎప్పటికప్పుడు మార్చి తీరుతుండే సరికి అటూ అధికారులు ఇటూ పోలీసులు బందోబస్తు కల్పించడంలో ఇబ్బందులు పడుతున్నారు.
ఎక్కడైనా అనుమతులు లేవు అని ప్రభుత్వా అధికారులు, పోలీసులు ఆపితే రాష్ట్ర ప్రభుత్వము మీద , వైసీపీ నాయకుల మీద అడ్డుకున్నారు అని నిందలు మోపి అల్లరి చెయ్యాలని పవన్ కళ్యాణ్, జన సేన నాయకులు అలోచనలు చేస్తున్నరు. పోలీసులు, ఎలక్షన్ అధికారులు ఎప్పటకప్పుడు సంయమనం పాటించి పవన్ కళ్యాణ్ ను ప్రచార కార్యక్రమాల గురించి అనుమతులు తీసుకోమని కోరుతూనే వున్న నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఇక నాలుగో రోజు ప్రచారంలో భాగంగా మొదట చర్చికి వెళ్ళారు. అక్కడ జనం లేక కేవలం పాస్టర్ లు మాత్రమే ఉండటంతో అక్కడినుండి దర్గాకు వెళ్ళి పూజలు చేశారు. తరువాత ప్రజలతో మమేకం అని కొద్దిసేపు గ్రామాల్లో పర్యటించారు, అక్కడ పవన్ కళ్యాణ్ బౌన్సర్ లు అతి చేసి ప్రజలను మహిళా కార్యకర్తలను తోసెయ్యడంతో గొడవలు జరిగాయి ఇంతలో జన సేన నాయకులు వచ్చి సర్దిచెప్పారు. అదలా ఉంచితే పవన్ కళ్యాణ్ ప్రచారంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ కనపడలేదు , టీడీపీ నాయకుడు వర్మ జాడ కూడ లేదు . దీనితో కూటమిలోని విభేదాలు బయట పడింది. వర్మను ప్రచార కార్యక్రమాల్లో దేనికి పాల్గొనలేదు అని మీడియా ప్రతినిధులు అడిగిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ప్రచారం గురించి మాకు ఎవరు సమాచారం అందించలేదు. అందుకే టీడీపీ తరుపున ఎవరు పాల్గొనలేదు అని సమాచారం అందించారు.
పవన్ కళ్యాణ్ ఇలా ప్రవర్తిస్తుంటే భీమవారం, గాజువాక ఫలితాలే పిఠాపురంలో రావడం ఖాయంగా కనిపిస్తోంది.