డిజిటల్ యుగంలో సర్టిఫికెట్లను డిజిటల్ చేసేసింది ప్రభుత్వం. గతంలో విద్యార్థి ఒక స్కూల్ మారాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కానీ ఈ నూతన డిజిటల్ విధానం ద్వారా విద్యార్ధి తాను చదవాలి అనుకున్న పాఠశాలలో పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ చెప్తే చాలు ట్రాన్స్ఫర్ కి సంబంధించిన అన్ని వివరాలు ఆ ఐడిలో పొంది పరిచి ఉంటాయి. అప్పుడు విద్యార్థికి ఎటువంటి కష్టం లేకుండా ఉంటుంది.
పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ద్వారా 1వ తరగతిలో విద్యార్థులను చేర్చుకునేటప్పుడు అన్ని రకాల సర్టిఫికెట్లు డిజిటలైజ్ చేయడం వల్ల విద్యార్థులను ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు బదిలీ చేసేటప్పుడు ఎలాంటి పత్రాల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు. బదిలీ జరిగేటప్పుడు పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ చెప్తే చాలు. పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ సంఖ్య వారి చదువు పూర్తయ్యేంతవరకు అలాగే కొనసాగనుంది అని విద్యాశాఖ కమీషనర్ వెల్లడించారు.
గతంలో ప్రభుత్వ పాఠశాల నుంచి ఎవరైనా విద్యార్ధి బదిలీ అవ్వాలి అంటే చాలా కష్టతరంగా ఉండేది. అక్కడ ఉండే ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థికి కావాల్సిన సర్టిఫికెట్స్ ఇచ్చే వారు కాదు. తమ పాఠశాలల్లో విద్యార్థుల శాతం తగ్గిపోతుందనే భయంతో టీసీ ఇవ్వడానికి నిరాకరించేవారు. ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇంకా కష్టంగా ఉండేది. ఒకటికి పది సార్లు తిప్పించుకుంటు ఒకవేళ విద్యార్ధి ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోతే ఆ ఏడాది ఫీజు రాదని రకరకాల కారణాల వల్ల కావాల్సిన సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధించేవారు.
విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం మరొక పాఠశాలలో ప్రవేశాన్ని తిరస్కరించడానికి లేదా ఆలస్యం చేయడానికి బదిలీ సర్టిఫికేట్ కారణం కాకూడదని విద్యాశాఖ కమీషనర్ వెల్లడించారు. 1వ తరగతిలో విద్యార్థులను చేర్చుకునేటప్పుడు అన్ని రకాల సర్టిఫికెట్లు (పత్రాలు) ఇప్పుడు డిజిటలైజ్ చేయడం వల్ల విద్యార్థులను ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు బదిలీ చేసేటప్పుడు ఎలాంటి పత్రాల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియ కోసం చైల్డ్ ఐడీ / ఆధార్ నంబర్/పెన్ (పర్మినెంట్ ఎడ్యుకేషన్) నంబర్ ఉంటే సరిపోతుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ టీసీ అవసరం లేదు. ఇతర రాష్ట్రాల విద్యార్థుల కోసం మైగ్రేషన్ సర్టిఫికేట్, ఇతర అవసరమైన సర్టిఫికెట్ల ప్రకారం విద్యార్థుల చేరికలు ఉంటాయి.