ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత పరిరక్షణకు విశాఖపట్నంలోని డాల్ఫిన్ నోస్పై రీసెర్చ్ సెంటర్ను మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్(ఎన్సీసీఆర్) నిర్మించింది. 5.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.62 కోట్ల వ్యయంతో ఎన్సీసీఆర్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో పాటు లేబొరేటరీ, పరిశోధన భవనం, వర్క్షాప్, ఆడిటోరియం, సెమినార్ హాల్, గెస్ట్ హౌస్, హాస్టల్, ఇతర భవనాలు కూడా నిర్మించి, ఎర్త్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా సిద్ధం చేసింది.
ఈ నెల 14న ఎన్సీసీఆర్ కేంద్రాన్ని కేంద్ర ఎర్త్ సైన్స్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించనున్నారు. విశాఖలోని ఎన్సీసీఆర్ కేంద్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం 972 కిలో మీటర్ల తీరంలో ఉన్న సమస్యలపై పరిశోధనలు నిర్వహించనుంది. రుతుపవన సీజన్లో వచ్చే వరదలు, సముద్రమట్టాల పెరుగుదల, మడ అడవుల విస్తీర్ణం తగ్గుదల, ఉష్ణమండల తుపానులు పెరుగుతున్న కాలుష్య కారకాల కారణంగా సాగర తీరంలో సంభవిస్తున్న పెను మార్పులు, కోతకు గురవుతున్న తీరప్రాంతాలు, ఇటువంటి విపత్తులన్నింటినీ నియంత్రించేందుకు తీసుకోవాల్సి న ముందుజాగ్రత్త చర్యలను, ప్రతి అంశంపై పరిశోధనలు నిర్వహించి వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఎన్సీసీఆర్ కేంద్రం కృషిచేస్తుంది.