వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కేంద్ర పురస్కారం
వై.సీ.పీ పార్టీ స్థాపనకు ముందునుంచీ జగన్ వెన్నంటే ఉండి, పార్టీ పెట్టిన తర్వాత ఢిల్లీ స్థాయిలో పార్టీ బలోపేతం కావడానికి తన శాయశక్తులా కృషి చేస్తూ జగన్కు తలలో నాలుకలా ఉండే వ్యక్తి ఎంపీ విజయసాయిరెడ్డి . ఢిల్లీ స్థాయిలో పరిచయాలతో ఎప్పుడూ పార్టీ ఉన్నతి గురించీ, రాష్ట్ర ప్రజలు ప్రయోజనాల గురించి పాటు పడే విజయసాయి రెడ్డికి “సంసద్ మహారత్న” అవార్డు వరించింది.
టూరిజం, రవాణా, సాంస్కృతిక శాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా అయిదేళ్ళు నుంచీ విజయసాయి రెడ్డి వినూత్న పనితీరు అవలంబించారు. ఆయా శాఖల మధ్య సమన్వయం, విజయవంతంగా ప్రణాళికల అమలు చేయడం వంటి వాటిలో విజయసాయిరెడ్డి విశేష ప్రతిభ కనబరిచారు.
ఆయన అత్యుత్తమ పనితీరుకు గాను ఈ సంషద్ మహారత్న అవార్డు దక్కింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్స్రాజ్ అహిర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ లు ఈ అవార్డును ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రధానం చేశారు.