చినబాబూ.. మీ కుర్చీని ఎప్పుడో మడత పెట్టేశారు..
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేశ్ తనను తాను అతిగా ఊహించుకుంటారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమఉజ్జీనని భావిస్తుంటారు. కానీ పిల్ల చేష్టలతో జనంలో చులకన అవుతుంటారు. బాబు వల్ల దొడ్డిదారిన మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన చినబాబుకు.. పార్టీ పెట్టి కష్టపడి పదవి తెచ్చుకున్న జగన్కు చాలా తేడా ఉంది. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో శంఖారావం సభ జరిగింది. ఇందులో లోకేశ్ మా జోలికి రావొద్దు జగన్.. వస్తే మీ సీటు మడిచేసే బాధ్యత తీసుకుంటానని వ్యాఖ్యానించారు. ఎలా చేస్తానంటే అంటూ స్టేజ్పై ఇనుప కుర్చీని మడతపెట్టారు. దీనికి ఐటీడీపీ ఇస్తున్న ఎలివేషన్లు మామూలుగా లేవు. ఈ సీన్ను ఆ తాత చూస్తే నువ్వు ఎందుకు చేశావంటూ డైలాగ్ వదులుతాడు.
అసలు టీడీపీ కుర్చీని ప్రజలు ఎప్పుడో మడత పెట్టేశారు. ఆ విషయం తండ్రీకొడుకులకు బాగా తెలుసు. జగన్ చాలా ధైర్యవంతుడు. ఓదార్పు యాత్ర చేసేందుకు ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న సోనియా గాంధీనే ఎదిరించిన ధీశాలి. చంద్రబాబు, కాంగ్రెస్ కుమ్మక్కై జైల్లో పెట్టించినా భయపడని వ్యక్తి. తన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా.. కొత్తవారిని తయారు చేసిన లీడర్. విజయవంతంగా పాదయాత్ర చేశారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లు సాధించారు. ఇది ఆయన స్థాయి. మరి చంద్రబాబు.. ఎన్టీఆర్కు వెన్నపోటు పొడిచి పార్టీని లాక్కొన్నారు. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేరు. కేసులంటే ఎవరి కాళ్లయినా పట్టుకునే స్థాయికి దిగజారే మనిషి. ఈయనే జగన్కు సమఉజ్జీ కాదు. ఇక లోకేశ్ అవుతాడా..
జగన్ రాజకీయ వ్యూహాలు ప్రత్యర్థులకు అంతు చిక్కవు. ఆయన పార్టీలో నుంచి బయటికి వచ్చాక కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయింది. ఏపీలో అయితే సుమారు పదేళ్లుగా ఒక్క ప్రజాప్రతినిధి లేరు. 19లో టీడీపీకి చుక్కలు చూపించారు. ఇప్పుడు రాజ్యసభలో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో జననేత జగన్ను ఎదుర్కొనేందుకు చంద్రబాబు పొత్తు కోసం బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు. అవసరం కోసం జనసేనను నెత్తిన పెట్టుకున్నారు. ఇంకో వైపు ఎల్లో మీడియాను ప్రయోగించారు. ఫేక్ ప్రచారాల కోసం సోషల్ మీడియాను విచ్చలవిడిగా వినియోగించుకుంటున్నారు. కుట్రలకు తెరలేపారు. వైఎస్సార్ కుటుంబంలో చిచ్చు పెట్టారు. షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ను చేసి ఉసిగొల్పారు. అందరూ గుంపుగా వస్తున్నా చిరునవ్వుతో ఎదుర్కొంటున్నారు జగన్. ఆయన కుర్చీ మడత పెట్టేస్తానంటూ లోకేశ్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చినబాబూ ఎప్పటికీ సమ ఉజ్జీ కాలేడని చెబుతున్నారు.
ఓ సభలో నారా వారి పుత్రరత్నం ‘మా తాత ఎన్టీఆర్ దేవుడు.. మా నాన్న చంద్రబాబు రాముడు.. నేను మూర్ఖుడు’ అన్నారు. ఇది అక్షరాల నిజం. చొక్కా స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చిందని జగన్ ఓ సభలో అన్నారు. దానికి కుర్చీ మడతపెట్టి లోకేశ్ కౌంటర్ ఇచ్చారని ఎల్లో గ్యాంగ్ మురిసిపోతోంది. ఢీ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. మహేష్బాబు మిల్క్బాయ్లా ఉంటాడు. నువ్వేమో మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావని.. ఓ సన్నివేశం జరుగుతుంది. జగన్ స్లీవ్ మడిస్తే ఆయన ఫ్యాన్స్ కేకలు వేశారు. అదే లోకేశ్ కుర్చీ మడతపెడితే చాలామంది తెలుగు తమ్ముళ్లే ఇదేం ఖర్మరా దేవుడా అని తలలు పట్టుకున్నారు. పెయిడ్ సోషల్ మీడియా పేజీలు మాత్రం ఎలివేషన్లు ఇచ్చాయంతే.. ఇవి చూసి మురిసిపోవద్దు లోకేశ్. జగన్ను ఢీకొట్టే శక్తి మీ నాన్న చంద్రబాబుకే లేక నానా అవస్థలు పడుతున్నాడు. ఇక నువ్వెంత..