షర్మిల చంద్రబాబుకి 200 కోట్లకు అమ్ముడుపోయిందని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గౌరవాన్ని కాంగ్రెస్ మరియు చంద్రబాబు కాళ్ళ దగ్గర షర్మిల పెట్టిందని ఆమెను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని మీడియా సమావేశంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు కాదని రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన సోనియాను, కాంగ్రెస్ ను దగ్గరకు రానిచ్చే ప్రసక్తి లేదని కాంగ్రెస్ తో పాటు షర్మిలకు కూడా డిపాజిట్లు రావని తేల్చిచెప్పారు. సీఎం జగన్ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నందుకు జగన్ పై విమర్శలు చేస్తున్నావా అంటూ దుయ్యబట్టిన ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్ వెనుకే ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు స్క్రిప్ట్ ఇస్తే షర్మిల చదువుతుందని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, షర్మిల కలిసి వచ్చినా గెలుపు ముఖ్యమంత్రి జగన్ దే అని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తేల్చిచెప్పారు